యువతులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. నెలకు రూ.35,000 వేతనంతో జాబ్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. అమ్మాయిలకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం మరో పథకాన్ని అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 35,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. యువతులకు ఇది అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. సావిత్రిబాయ్ జ్యోతిరావ్ ఫూలే ఫెలోషిప్ ఫర్ సింగిల్ గర్ల్ పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఫ్యామిలీలో ఒకే ఒక్క బాలిక ఉంటే ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో ఒకే ఒక్క బాలిక ఉంటే ఐదు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనీ అందిస్తుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకుంటే మంచిది. కుటుంబానికి సంతానంలో బాలిక ఒకరే ఉన్నా లేదా ఇద్దరు బాలికలు ఉన్నా ఒక బాలిక కోసం ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

100 రూపాయల స్టాంప్ పేపర్ ను అఫిడవిట్ రూపంలో సమర్పించి ఆడపిల్లల తల్లీదండ్రులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. కేంద్రం జూనియర్ రీసెర్చ్ ఫెలోస్‌కి నెలకు రూ.31 వేల చొప్పున రెండు సంవత్సరాల పాటు అందించనుందని సీనియర్ రీసెర్చ్ ఫెలోస్‌కి రూ.35,000 చొప్పున 3 సంవత్సరాల పాటు అందించనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

యూనివర్శిటీ లేదా కాలేజీ లేదా సంస్థలో పీహెచ్డీ చేస్తూ 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అర్హతలు ఉన్నవాళ్లు 45 సంవత్సరాల లోపు ఉంటే అర్హులు.