ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో క్రీడాకారుల కోసం 421 పోస్టులు కేటాయించారు. విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వనున్నట్టు క్రీడా శాఖా మంత్రి వెల్లడించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నోటిఫికేషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అర్హత ఉన్న క్రీడా కారులంతా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. https://sports.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
క్రీడా రంగంలో ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. మెగా డీఎస్సీలో క్రీడా కోటాను తీసుకొనిరావడంతో క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు ఎంతో సంతోషిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 73 పోస్టులు ఉండగా చిత్తూరు జిల్లాలో 41 పోస్టులు, తూర్పు గోదావరి జిల్లాలో 38 పోస్టులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 34 పోస్టులు, గుంటూరు జిల్లాలో 33 పోస్టులు ఉన్నాయని సమాచారం.
విశాఖపట్నం జిల్లాలో 32 పోస్టులు ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో 29 పోస్టులు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 22 పోస్టులు ఉండగా వైఎస్సార్ జిల్లాలో 20 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 20 పోస్టులు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 17 పోస్టులు, శ్రీకాకుళం జిల్లాలో 16 పోస్టులు, విజయనగరం జిల్లాలో 10 పోస్టులు ఉన్నాయి.