బీటెక్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో జాబ్స్.. భారీ వేతనంతో?

భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో బీఈఎల్ ఒకటి. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్ విద్యార్హతతో ఈ జాబ్స్ కల్పిస్తోంది. మెుత్తం 205 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. ఆకర్షనీయ జీతాన్ని బీఈఎల్ ఆఫర్ చేస్తోంది.

బీఈఎల్ విడుదల చేసిన ఈ ఉద్యోగాలు వివిధ విభాగాల్లో ఉన్నాయి. ఆ విభాలకు ఎంటో చూడండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ – I మరియు ట్రైనీ ఇంజనీర్ – I పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మెుత్తం 205 ఉద్యోగాలు కూడా ఓపెన్ నోటిఫికేషన్ ద్వారానే ఎంపిక చేయటం జరుగుతోంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 జూన్ 2023. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక bel-india.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు అప్లై చేయటానికి అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE, B.Tech, B.Sc డిగ్రీని పొంది ఉండాలి.దీంతో పాటు అభ్యర్థికి 55 శాతం మార్కులు ఉండటం కూడా అవసరం. వయోపరిమితి ప్రాజెక్ట్ ఇంజనీర్ I పోస్టుకు 32 ఏళ్లు ట్రైనీ ఇంజనీర్ I పోస్టుకు 28 సంవత్సరాలుగా నిర్ణయించారు.