బిర్యానీ ఆకులతో తయారు చేసిన టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

బిర్యానీ ఆకులను సహజంగా నాన్ వెజ్ వంటకాలైన చికెన్, మటన్, ఎగ్ బిర్యానీల్లో రుచి ,సువాసనల కోసం ఉపయోగిస్తాము అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న బిర్యాని ఆకులతో రుచికరమైన టి నీ తయారు చేసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు బిర్యానీ ఆకుల టీ ఎలా తయారు చేసుకోవాలి, దీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన బిర్యాని ఆకుల టి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదట రెండు లేదా మూడు పచ్చి బిర్యానీ ఆకులు లేదా ఎండు బిర్యానీ ఆకులను సేకరించి చిన్న ముక్కలుగా కట్ చేసి తగినన్ని నీరు పోసి బాగామరిగించాలి ఇలా మరిగించిన తర్వాత గోరువెచ్చగా ఉన్న సమయంలో ఆ నీటిని వడ గొట్టి తాగటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

బిర్యానీ ఆకుల టీ ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి ఉబకాయం, అతిగా బరువు పెరగడం వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.ఇలా అధిక శరీరం బరువుతో బాధపడే వారికి బిర్యానీ ఆకులతో తయారు చేసిన టీ ఎంతో ఉపయోగపడుతుంది. బిర్యానీ ఆకులు రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి కావున ప్రతిరోజు వీటి కషాయం తాగితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చక్కెర వ్యాధి అదుపులో ఉండి మంచి ఫలితం ఉంటుంది.

యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ వైరల్ గుణాలు బిర్యానీ ఆకుల్లో మెండుగా ఉంటాయి .అందుకే ఈ టీ తరచు తాగటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా సీజనల్గా వచ్చేటటువంటి వ్యాధులను కూడా పూర్తిగా నివారిస్తుంది. బిర్యానీ ఆకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఉండడంవల్ల వీటిని ప్రతిరోజు కషాయంగా తీసుకుంటే మన శరీరంలోని క్యాన్సర్ కారకాలతో సమర్థవంతంగా పోరాడతాయి.