చలికాలంలో పసుపును ఈ విధంగా ఉపయోగిస్తే ఎన్ని లాభాలు తెలుసా?

శీతాకాలం సీజన్ ఆరంభంతోనే అనేక ఇన్ఫెక్షన్లను మోసుకొస్తుంది. కారణం శీతాకాలంలో అధిక తడి వాతావరణం కారణంగా ప్రమాదకర సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా ఉంటుంది. ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ మరియు ఫంగస్ వంటివి మన శరీరంలో ప్రవేశించి మన ఇమ్యూనిటీ సిస్టంపై తీవ్ర ప్రభావం చూపించడంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఒళ్ళు నొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఈ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడానికి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు అత్యధిక యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్న పసుపును ఆహారంలో తీసుకుంటూనే అదనంగా పాలల్లో కలుపుకొని లేదా కాషాయ రూపంలో ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.అయితే మార్కెట్లో దొరికే రెడీమేడ్
పసుపు కన్నా మనమే సొంతంగా పసుపు కొమ్ములను సేకరించి మర పట్టించుకుని వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోరువెచ్చని పాలల్లో టేబుల్ స్పూన్ పసుపును కలుపుకొని సేవించడం వల్ల పసుపులో సహజంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు మన శరీరంలోని వ్యాధికారక సూక్ష్మజీవులను నివారించి సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు ,జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తకుండా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

పసుపులో సహజంగా లభించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించడంతోపాటు శరీర వాపులు కళ్ళు చేతులు తిమ్మిర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. బస్సులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త ప్రసన్న వ్యవస్థను పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని మెదడు పనితీరును రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.