చర్మ సౌందర్యం కోసం రోజ్ వాటర్ వాడుతున్నారా… ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

సాధారణంగా చాలామంది తమ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడం కోసం ఎన్నో రకాల క్రీములు, పేస్ ప్రాజెక్టులు ఉపయోగిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే కొందరు రోజ్ వాటర్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా రోజ్ వాటర్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గులాబీ పూల మిశ్రమాన్ని ప్రముఖ బ్యూటీ కాస్మోటిక్స్ లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గులాబీ పూలను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేసి రోజ్ వాటర్ తయారు చేస్తున్నారు.రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని టోనర్లోనో, మిస్టలోనూ, మరెన్నో కాస్మెటిక్స్ లో ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తూ వస్తున్నారు.

చర్మ సంరక్షణలో గులాబీ నీళ్లను (రోజ్ వాటర్) ను ఉపయోగిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మంపై ఏర్పడే రంధ్రాలను, మచ్చలను, ముడతలను తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా మృత కణాలను తొలగిస్తూ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది.

జిడ్డు చర్మ సమస్యతో బాధపడేవారు ఒక టీస్పూన్ ముల్తానీ మట్టిలో రెండు లేదా మూడు టీస్పూన్ల రోజ్ వాటర్ వేసి మెత్తటి మిశ్రమంగా మార్చుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, సున్నితంగా స్క్రబ్ చేస్తూ రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై జిడ్డు సమస్య తొలగిపోవడమే కాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొటిమలు, మచ్చలు మరియు ముడతలు తొలగిపోయి చర్మం సహజ కాంతివంతంగా మెరుస్తుంది.రోజ్ వాటర్ బాటిల్ ని ముఖానికి 5 నుండి 6 అంగుళాల దూరంలో ఉంచి స్ప్రే చేసుకొని గాలికి ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే అన్ని రకాల చర్మ అలర్జీలు తొలగిపోతాయి.