అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారా.. ప్రతిరోజు రాత్రి ఇది తాగితే చాలు సమస్యకు చెక్ పెట్టినట్లే?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు సమస్య ఒకటి.చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉండగా మరి కొంతమంది నడుము చుట్టూ అలాగే తొడలు భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ విధంగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవాలంటే చాలామంది ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ఈ విధంగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలంటే ప్రతి రోజు రాత్రి ఈ కషాయం తాగటం వల్ల ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ సొంపు మరొకటేబుల్ స్పూన్ జీలకర్రను దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత వీటిని మెత్తని మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలోకి చిటికెడు కలుపుకొని తాగటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగిస్తుంది.

ఇలా మూడు నెలలపాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ కషాయం తాగటం వల్ల తొందరగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడమే కాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి వ్యక్తపదార్థాలను బయటకు తొలగిస్తూ అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ కషాయం తాగటం వల్ల చర్మంపై ఏర్పడిన ముడతలు తొలగిపోయి ఎంతో యవ్వనంగా కనబడతారు.