మూత్ర విసర్జన సమయంలో మంట నొప్పి సమస్యతో బాధపడుతున్నారా… పరిష్కారాలు ఇవే!

సాధారణంగా కొందరు మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు.అయితే కొందరు ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడంతో అవి మరింత తీవ్రతరం అవుతూ ఉంటాయి. మరికొందరు వెంటనే వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు కానీ ఇలామూత్ర విసర్జన సమయంలో నొప్పి మంట ఏర్పడటానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి అయితే ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలు కూడా ఉన్నాయని చెప్పాలి.

మహిళలలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి అయితే ఈ సమస్యలు ఏర్పడటానికి గల కారణం మారిన ఆహారపు అలవాట్లు,సురక్షితం కాని లైంగిక చర్యలు, నీళ్లు తక్కువగా తాగడం,వ్యక్తిగత శుభ్రత పాటించక పోవడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. మూత్రాశయ,కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి బయట పడాలంటే మన జీవన విధానంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. మనందరి ఇండ్లలో తప్పనిసరిగా ఉండే ధనియాలు కిడ్నీ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.కావున ధనియాలను, పటిక బెల్లాన్ని ఉప్పును తీసుకొని నీటిలో బాగా మరిగించిన తర్వాత వచ్చే కషాయాన్ని చల్లార్చు కొని రోజుకు నొప్పి తీవ్రతను బట్టి రెండు లేదా మూడు సార్లు సేవిస్తే మూత్ర నాళాల్లో ఇన్ఫెక్షన్ తగ్గి మంట, నొప్పి, దురద వంటి సమస్యలు తొలగిపోతాయి.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ విధమైనటువంటి సమస్య అధికంగా ఉంటుంది ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ధనియాల కషాయాన్ని అధికంగా సేవించాలని మన పెద్దలు చెబుతున్నారు. మరికొందరిలో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం వల్ల కూడా మూత్రాశయలో ఇన్ఫెక్షన్ వచ్చి మంటగా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ఒత్తిడి అధికమై మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. కావున ఎక్కువ రోజులు మూత్ర ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతుంటే తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి.