Bill Gates: ఆఖరి పైసా వరకు ప్రజలకే.. ఆ ఏడాది తర్వాత గేట్స్ ఫౌండేషన్ గేమ్ ఓవర్!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ మరోసారి తన హృదయ విశాలతను చాటారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను 2045 నాటికి పూర్తిగా మూసివేసే దిశగా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆ సమయంలో ఫౌండేషన్ వద్ద ఉండే 200 బిలియన్ డాలర్లు ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన వంటి రంగాలకు పూర్తిగా వినియోగించాలని గేట్స్ సంకల్పించారు.

ఈ నిర్ణయం తర్వాత బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ స్పందిస్తూ.. ఇది తమ ఇద్దరి కలగా అభివర్ణించారు. ఫౌండేషన్ కేవలం ధన సంపాదన కోసం కాకుండా, సమాజంలో అవసరమైన వారికి సాయం చేయాలనే లక్ష్యంతోనే ప్రారంభించారని చెప్పారు. “ఆఖరి డాలర్ ఖర్చయిన తరువాత కూడా ఫౌండేషన్ చేసే సేవలు వేల మందికి వెలుగు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,” అని మెలిండా వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఫౌండేషన్ వందల కోట్ల డాలర్లను మలేరియా, టీబీ, మాతాశిశు ఆరోగ్యం, చిన్నారుల విద్య, రోగనిరోధక టీకాలు వంటి విభాగాల్లో వినియోగించింది. రాబోయే 20 ఏళ్లలో ఈ వ్యయాన్ని రెట్టింపు చేయాలని గేట్స్ దంపతులు భావిస్తున్నారు. ఇందుకోసం ఫౌండేషన్ వార్షిక బడ్జెట్ పెంచే దిశగా కార్యాచరణ చేపట్టనుంది.

గత ఏడాది మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలిగి తన స్వంత సంస్థ ‘పివోటల్ వెంచర్స్’ ద్వారా మహిళల సాధికారతపై దృష్టిసారించారని తెలిసిందే. అయినా ఫౌండేషన్ తుది ప్రయాణానికి మద్దతుగా నిలవడం అభినందనీయమనే చెప్పాలి. బిల్ గేట్స్ చేపట్టిన ఈ దారుణమైన నిర్ణయం ధనవంతులకు ఒక మానవతా పాఠంగా నిలుస్తోంది. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న సంకల్పం ఇలాంటి అద్భుత మార్గాన్ని ఎంచుకుంది. 2045 తర్వాత గేట్స్ ఫౌండేషన్ లేకపోయినా… దాని ప్రభావం మాత్రం శాశ్వతమే!

నన్నే ఆపుతారా ...? | KA Paul Hulchul At Mumbai Airport | Ind vs Pak War | Telugu Rajyam