బిల్ గేట్స్ తో చేతులు కలిపిన ఆనంద్ మహేంద్ర… కలిసి పని చేద్దాం అంటూ భేటీ!

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిశాడు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ వేదికగా తాము భేటీ అయిన విషయాన్ని తెలిపాడు. ఇలా టెక్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర మైక్రోసాఫ్ట్ దిగజం బిల్ గేట్స్ ను కలవడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది ఇలా ఈ ఇద్దరు సెలబ్రిటీలు కలవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని కూడా ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర ట్విట్టర్లో వీరిద్దరూ భేటీ అయిన విషయాన్ని గురించి తెలియజేస్తూ…ఇక తాము ఐటీ వ్యాపారం గురించి చర్చ చేయడానికి కలవలేదని.. సామాజిక చైతన్యంపై చర్చలు చేసాము అని అన్నాడు. అంతేకాకుండా బిల్ గేట్స్ తన పుస్తకాన్ని ఆటోగ్రాఫ్ చేసి ఇస్తున్న ఫోటోలను కూడా పంచుకున్నాడు ఆనంద్. అదేవిధంగా ఆయన కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర తెలియజేశారు.

ఈ విధంగా మరోసారి బిల్ గేట్స్ ను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆనంద్ మహేంద్ర తెలియజేశారు. తమ బృందాల మధ్య సంభాషణ మొత్తం ఐటీ లేదా ఏదైనా వ్యాపారం గురించి కాదు అంటూ.. కేవలం సామాజిక చైతన్యం పెంచడం కోసం మేము ఎలా కలిసి పని చేయవచ్చు అని దాని గురించి చర్చించాం అని ఆయన తెలిపాడు. భారతదేశం తనకు భవిష్యత్తుపై ఆశ కలిగిస్తుందని.. మై మెసేజ్ ఇన్ ఇండియా: టు ఫైట్ క్లైమేట్ చేంజ్, ఇంప్రూవ్ గ్లోబల్ హెల్త్ అని పేర్కొన్నాడు.