Tirumala Tickets: భక్తులూ! బీ రెడీ.. శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల..

Tirumala Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేయి కళ్ళతో వేచి చూస్తున్న భక్తులకి టీటీడీ ఒక తియ్యటి శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీ వారిని జనవరి మాసంలో దర్శించుకునేందుకు ఈ నెల 24న ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయలు చెల్లించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. ప్రతిరోజుకి 20 వేల చొప్పున మొత్తం 6 లక్షల టిక్కెట్లని టీటీడీ విడుదల చేయనుంది.

అంతేకాకుండా.. జనవరి నెలకి సంబంధించిన సర్వదర్సనం టికెట్ టోకెన్లు ఆఫ్ లైన్ లో 5 వేలు, ఆన్ లైన్ లో 5 వేలు టీటీడీ విడుదల చేయనుంది. 25వ తేదీ న ఉదయం 9 గంటలకి ఆన్ లైన్ లో సర్వదర్శనంకి సంబంధించిన టిక్కెట్ టోకెన్లు టీటీడీ విడుదల చేయనుంది.

జనవరి నెలకి సంబంధించి రోజుకి 5 వేల టోకెన్లని తిరుపతిలో జారీ చెయ్యనున్నారు టీటీడీ. కాగా, ఈ నెల ఆఖరు 31వ తేదీ నుంచి టీటీడీ అధికారులు తిరుపతిలో ఆఫ్ లైన్ లో సర్వ దర్శనం కి సంబంధించి టోకెన్లను జారీ చెయ్యనున్నారు.