డబ్బు సమస్యలతో బాధ పడుతున్నారా.. ఇలా చేస్తే కచ్చితంగా కోటీశ్వరులు అవుతారట!

మనలో చాలామంది డబ్బు సమస్యలతో బాధ పడుతుంటారనే సంగతి తెలిసిందే. ఎంత సంపాదించినా మిగలడం లేదని మనలో చాలామంది వేర్వేరు సందర్భాల్లో చెబుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ప్రతిఫలాలను పొందే అవకాశం ఉంటుంది. నా కర్మ, నా జీవితం ఇలా అయిపోయింది ఇలాంటి పదాలు మాట్లాడకూడదని పండితులు చెబుతుండటం గమనార్హం.

ఈ విధంగా అంటే ఆత్మ క్షోభిస్తుందని పండితులు వెల్లడిస్తున్నారు. మనం ఏ తప్పు చేసినా ఆత్మ సాక్షి అని పండితులు చెబుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని అనుకోవడం కరెక్ట్ కాదని పండితులు వెల్లడిస్తున్నారు. రూపాయి అప్పు తీర్చడం కోసం మళ్లీ జన్మ ఎత్తాల్సి ఉంటుందని పండితులు అన్నారు. మనం మాట్లాడే మాటల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పండితులు పేర్కొన్నారు.

రుణం ఉంటే మళ్లీ జన్మ ఎత్తాల్సి ఉంటుందని పండితులు వెల్లడిస్తున్నారు. ధన యోగానికి కనక పుష్యరాగంను వాడతారని పండితులు అన్నారు. పసుపు కొమ్ము కూడా గురుడికి సంకేతమని గురు యోగం ఉండాలంటే పచ్చి పసుపు కొమ్మును తీసుకొని ఆ కొమ్ముకు దారం కట్టి దేవుని గుడిలో పెట్టి పూజ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. కనకపుష్యరాగం అందుబాటులో లేని వాళ్లు ఈ విధంగా చేస్తే మంచిది.

పసుపు కొమ్ము పూసలతో ఉన్న దండను ఆవుపాలలో శుద్ధి చేసి మెడలో వేసుకుంటే మంచి ఫలితాలను కచ్చితంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. పసుపుకు మైల ఉండదని పండితులు వెల్లడిస్తున్నారు. సులువుగా ధన యోగం పొందాలని అనుకుంటే ఈ విధంగా చేస్తే మంచిది.