దోషాలు తొలిగిపోయి ధనవంతులు అవ్వాలంటే రావి ఆకులతో ఇలా పూజ చేస్తే చాలు..?

మన హిందూ సంస్కృతిలో కొన్ని రకాల చెట్లను దైవంతో సమానంగా భావించి పూజలు చేస్తారు. అలా పూజలు చేసే మొక్కలలో రావి చెట్టు కూడా ఒకటి. హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో విశిష్టత ఉంది. రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావించి ప్రతిరోజు పూజలు చేస్తారు. ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కలసి ఉంటాయి. ఇక రావి చెట్టును సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. అందువల్ల అనేక శుభకార్యాలలో పూజా కార్యక్రమాలలో కూడా రావి ఆకులను ఉపయోగిస్తారు. రావి చెట్టును పూజించటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రావి ఆకులతో పూజ చేయడం వల్ల దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. రావి ఆకులతో ఎలా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రావి చెట్టు ఎంతో విశిష్టత కలిగినది. రావి చెట్టును పూజించటం వల్ల శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. రావి చెట్టును పూజించడమే కాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి వాటిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు తొలగిపోతాయి. అలాగే పూర్వ జన్మల పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే రావి చెట్టు ఆకులతో ఎలా పూజ చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడగాలి. అనంతరం దేవుడి ముందు పరచాలి. వాటిపై ఒక ప్రమిదను పెట్టాలి. అనంతరం అందులో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి.

ఇలా రోజూ ఉదయాన్నే రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఇలా దీపం వెలిగించడం వల్ల మనం చేపట్టిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. అలాగే పూర్వ జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే కర్మ ఫలితాన్ని కూడా తొలగించుకోవచ్చు. ముఖ్యంగా శాప దోషాలు, ఇతర దోషాలు కూడా తొలగిపోయి సమస్యల సుడిగుండం నుండి బయట పడతారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి రుణ విముక్తులు అవుతారు. ధనం బాగా సంపాదించి ధనవంతులు అవుతారు.