లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఈ పనులు చేస్తే సరి…. అమ్మవారి అనుగ్రహం మన పైనే?

ప్రతి ఒక్కరి మనగడకు డబ్బు ఎంతో అవసరం అయితే చాలామంది ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ డబ్బు మాత్రం చేతిలో నిలబడదు.ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ చేతిలో డబ్బు నిలబడక ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చిన్న పనులు చేస్తే అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపైనే ఉంటుందని చెప్పాలి. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి అనే విషయానికి వస్తే….

పురాణాల ప్రకారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో చీపురుతో ఉడ్చి ఇల్లు శుభ్రం చేయరాదు. ఇలా చేయటం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం ఉండదు. సాయంత్రం సూర్యుడు అస్తమించటానికి ముందే ఇళ్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి దీపారాధన చేయటం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో చీపురుతో ఊర్చకూడదు. ఇంటి పరిసర ప్రాంతాలలో ఉమ్మి వేయడం అసభ్యతకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఇంటి పరిసర ప్రాంతాలలో కానీ, గుడి ప్రాంగణంలో కానీ ఉమ్మి వేయటం వల్ల మనపై లక్ష్మి దేవి అనుగ్రహం ఉండదు.

సాధారణంగా ఇంట్లో దేవుడి గదిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని అందరూ భావిస్తారు. దేవుడి గదితో పాటు ఇల్లు మొత్తం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా బాత్రూం కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బాత్రూమ్ ని చంద్రుడి ప్రవేశంగా భావిస్తారు. బాత్రూం శుభ్రంగా లేకపోవడం వల్ల అనేక వ్యాధులతో పాటు చంద్రగ్రహణం కూడా మనపై పడుతుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అందువల్ల ఇంటితోపాటు బాత్రూం కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న పాత్రలను అలాగే ఉంచడం వల్ల ఇంటికి అరిష్టం. భోజనం చేసిన వెంటనే గిన్నెలు శుభ్రంగా కడగడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.