‘2.0’అప్పుడే అంత కలెక్ట్ చేసిందా..అంతా షాక్

సూపర్ స్టార్ రజినీ కాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2.0. ఈ సినిమా మొన్న గురువారం విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తు సంగతి తెలిసిందే. లింగ , కబాలి , కాలా చిత్రాలతో నిరాశ పరిచిన రజినీ మళ్ళీ ఈ చిత్రం తో ఫామ్ లోకి వచ్చారని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

‘‘2.0’ చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసింది. ఇది కేవలం బ్లాక్‌బస్టర్‌ మాత్రమే కాదు.. మెగా బ్లాక్‌బస్టర్‌’ అంటూ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఆనందంతో ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా చిన్ని ‘3.0’ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇక ‘2.0’ హిందీ వెర్షన్‌లో ఆదివారానికి రూ.95 కోట్లు వసూలు చేసిందని సినీ ట్రేడ్ ఎనాలలిస్ట్ తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు.మొదటి రోజుతో పోల్చితే నాలుగో రోజు వసూళ్లు 41.67 శాతం పెరిగాయని అన్నారు. ఈ సినిమా గురువారం (విడుదల రోజు) రూ.19.50 కోట్లు, శుక్రవారం రూ.17.50 కోట్లు, శనివారం రూ.24 కోట్లు, ఆదివారం 34 కోట్లు మొత్తం రూ.95 కోట్లు (హిందీ) సాధించినట్లు తెలిపారు.

2010లో వచ్చిన సూపర్‌హిట్‌ ‘రోబో’ సీక్వెల్‌ ‘2.0’. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ విలన్ పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ కథానాయిక. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సినిమాను నిర్మించింది.