ట్రైలర్ కూడా ఇలాగే ఉంటే కష్టం ‘మిస్టర్‌ మజ్ను’

అఖిల్ అక్కినేని హీరోగా ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’.శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కేవలం 56 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లోని సన్నివేశాలు యూత్ ని టార్గెట్ చేసినట్లున్నా…సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయింది.

వాస్తవానికి ఇప్పుడు అఖిల్ ఉన్న పరిస్దితిల్లో అదిరిపోయే టీజర్, ట్రైలర్ వస్తేనే ఓపినింగ్స్ బాగుంటాయి. ఏ మాత్రం డల్ గా ఉన్నా కష్టం అనిపిస్తాయి. అఖిల్ క్యారక్టరైజేషన్ పై దృష్టిపెట్టినట్లున్న ఈ టీజర్ లో ఆ స్దాయి కనపడలేదు. దాంతో ట్రైలర్ అయినా అంతా మాట్లాడుకునేలా ఉండాలని, కేవలం డైలాగులతో కాకుండా విజువల్స్ తో మైమరిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘దీని ఇంట్లో రాత్రి 11.30 గంటలకు ఏం చేస్తున్నావ్‌?’ అని ఓ మహిళ ప్రశ్నించగా.. ‘మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఒత్తిడిగా ఫీల్‌ అయినప్పుడు ఏం చేసేవారు?’ అని ఆమెను అఖిల్‌ ఎదురు ప్రశ్నించే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘క్రేజీ క్యారెక్టర్‌ కదా?’ అని నటి విద్యుల్లేఖ అంటే.. ‘లేదు.. డేంజరస్‌ క్యారెక్టర్‌’ అని నిధి బదులిచ్చారు. ఈ పంచ్ లు బాగానే ఉన్నా..జనాలకు పంచ్ ఫీలయ్యే స్దాయిలో లేదనేది నిజం.

‘ప్రపంచంలోని అందరు అమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు.. వాళ్లకీ ఓ జీవితం ఉంటుంది. దాన్ని నేను గౌరవిస్తా..’ అని అఖిల్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ముగిసింది. చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. థమన్ బాణీలు కట్టారు. జనవరి 25న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.