సినిమా వాళ్ళ గురించి ఏ న్యూస్ వచ్చినా సోషల్ మీడియా జనాలకు పండుగే. ముంబైలోని బి-టౌన్ గల్లీలలో ఇప్పుడు ఒక సంచలన గాసిప్ తెగ హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ లవ్లీ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల మధ్య అంతర్గతంగా ఏదో పెద్ద గొడవే జరిగిందని, వ్యవహారం ఏకంగా విడాకుల వరకు వెళ్లిందంటూ సోషల్ మీడియా వేదికగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కన్నడ నటుడు యష్ సరసన కియారా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ జంట చుట్టూ రకరకాల కథనాలు అల్లుతున్నారు.
ముఖ్యంగా ఈ చిత్రంలోని కొన్ని ఘాటు రొమాంటిక్ సన్నివేశాలు, ‘తబాహి’ పాటలోని కియారా బోల్డ్ లుక్స్ చూసి కొందరు నెటిజన్లు సిద్ధార్థ్ను దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. భార్య ఆ రేంజ్ లో బోల్డ్ సీన్స్ చేయడాన్ని సిద్ధార్థ్ జీర్ణించుకోలేకపోయాడని, ఈ విషయమై ఇద్దరి మధ్య గట్టిగా గొడవ జరగడంతో సోషల్ మీడియాలో సైతం ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విడాకుల టాక్ ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే, తెరవెనుక మరో వార్త కూడా జోరుగా ప్రచారంలో ఉంది.
కియారాను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్ ఇస్తూ సిద్ధార్థ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా భార్యకు మద్దతుగా నిలిచాడని, ఈ సినిమా ఆమె కెరీర్లోనే బెస్ట్ అంటూ ప్రశంసించాడనే టాక్ నడుస్తోంది. కానీ, సోషల్ మీడియా పుకార్ల రాయుళ్లు మాత్రం ఇదంతా కేవలం పైకి చూపిస్తున్న నాటకమని, లోపల మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ ప్రచారాన్ని ఆపడం లేదు. గతంలో కూడా వీరిద్దరి పెళ్లి ఇష్టం లేని కొందరు ఇలాంటి విడిపోయే పుకార్లను లేవనెత్తగా, కియారా లైట్ తీసుకున్నట్లు ఇంటర్వ్యూలలో చెప్పింది. అయినప్పటికీ, ఇటీవలే ఒక బిడ్డకు తల్లిదండ్రులైన ఈ జంట నిజంగానే టాక్సిక్ సినిమా వివాదంతో విడిపోతున్నారా, లేక ఇదంతా సినిమా ప్రమోషన్ల కోసం పుట్టిన మరో సాధారణ బాలీవుడ్ గాసిప్పేనా అనేది ప్రస్తుతం సినీ జనాల్లో ఒక పెద్ద మిస్టరీగా మారింది.