‘దొరసాని’ బిజినెస్ పరిస్దితి ఏంటి?

‘దొరసాని’బిజినెస్ పరిస్దితి ఏంటి?

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తనయ శివాత్మికలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘దొరసాని’. కె.వి.ఆర్. దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం రేపు( జూలై 12న) గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకుని, సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఈ నేపద్యంలో చిత్రంపై ట్రేడ్ లో ఉన్న అంచనాలు చూద్దాం.

చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమా పెద్ద సంచలనమే సృష్టిస్తోందని చెప్పాలి. సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా నైజాంలో ఫ్యాన్సీ రేట్లకు అమ్మారని, మిగతా ఏరియాల్లో ఓ మాదిరిగా బిజినెస్ చేసారని చెప్తున్నారు. కొన్ని ఏరియాలు నమ్మకంతో నిర్మాతలు తమ దగ్గర పెట్టుకున్నారట. అయితే సినిమాపై వచ్చిన క్రేజ్ కు రెట్టింపు రేట్లు చెప్పటంతో మంచి డిస్ట్రిబ్యూటర్స్ సైతం వెనకడుగు వేసారని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాపై తెలంగాణా ప్రాంతాల్లో మంచి క్రేజ్ ఉంది. వాటిని అందుకుందంటే ఆపలేం అంటున్నారు. మరో ఆర్ ఎక్స్ 100 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు.

మరో ప్రక్క సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విజయంపై ధీమాగా ఉన్నామని.. సినిమా విడుదలైన తర్వాత కూడా ఆనంద్, శివాత్మికల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహేంద్ర గతంలో షార్ట్ ఫిల్మ్స్‌‌, యాడ్స్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహేంద్ర.. ఇప్పుడు ‘దొరసాని’ చిత్రాన్ని కూడా పూర్తి తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కించా రు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యాష్ రంగినేని , మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.