ఈ రోజు రిలీజ్ ‘దొరసాని’టాక్ ఏంటి?

ఈ రోజు రిలీజ్ ‘దొరసాని’టాక్ ఏంటి?

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తనయ శివాత్మికలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘దొరసాని’. కె.వి.ఆర్. దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఈ రోజు( జూలై 12న) గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకుని, సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఈ నేపద్యంలో చిత్రంపై టాక్ ఎలా ఉందో చూద్దాం.

ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమా హార్ట్ టచింగ్ గా ఉందంటూ బెస్ట్ లవ్ స్టోరీ అని చూసినవాళ్లు చెప్తున్నారు. 1980ల కాలంలో జరిగే దొరసాని కథ ట్రూ అండ్ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ గా ఆడియెన్స్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా క్లయిమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ హార్ట్ ని టచ్ చేస్తాయని అంటున్నారు. ఒక నిజాయితీగల ప్రేమకు ప్రతిరూపమే దొరసాని అని ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా అని చూసినవారు చెప్తున్నారు. అయితే సినిమా స్లోగా సాగటం

మొత్తానికి ఆనంద్ దేవరకొండ – శివాత్మిక రాజశేఖర్ వారి మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకున్నారు. దొరసానికి అందుతున్న టాక్ తో అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని అర్దమవుతోంది. మరి సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ప్పటికే ఈ సినిమాపై తెలంగాణా ప్రాంతాల్లో మంచి క్రేజ్ ఉంది. మరో ఆర్ ఎక్స్ 100 అవుతుందని చెప్తున్నారు.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహేంద్ర గతంలో షార్ట్ ఫిల్మ్స్‌‌, యాడ్స్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహేంద్ర.. ఇప్పుడు ‘దొరసాని’ చిత్రాన్ని కూడా పూర్తి తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కించా రు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యాష్ రంగినేని , మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.