YS Jagan – Duvvada Srinivas: జగన్ పై ఒత్తిడి పెరిగాకే.. దువ్వాడపై చర్యలు?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చివరికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఏడాదిగా తన వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీకి తలనొప్పిగా మారిన ఆయనపై పార్టీ అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన దివ్వెల మాధురితో పెళ్లికి అతీతంగా తిరుగుతున్న వీడియోలు, ఇంటర్వ్యూలు అప్పుడే వైరల్ అవుతున్నా పార్టీ నుంచి స్పందన లేకపోవడం విమర్శలకు తావిచ్చింది.

దువ్వాడ వ్యవహారాన్ని వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచీ వ్యతిరేకించలేదు అన్న ఆరోపణలు పార్టీ వర్గాల నుంచే వచ్చాయి. ఆయన భార్య వాణి నేరుగా జగన్‌ను కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ, అది కుటుంబ విషయం అంటూ తప్పించుకున్న జగన్, తర్వాత దువ్వాడకే టెక్కలి టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా దువ్వాడపై ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం.

ఇటీవల దువ్వాడ, మాధురి కలిసి ఓ చీరల షాపును ప్రారంభించిన వీడియోలతో పాటు తిరుమల దర్శనం, మీడియా ఇంటర్వ్యూలు పార్టీలో అసహనం రేకెత్తించాయి. మంగళవారం తాడేపల్లిలో జరిగిన పీఏసీ సమావేశంలో పలువురు నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించడంతో, జగన్ అణిచివేయాల్సిన పరిస్థితి ఎదురైందని సమాచారం. విధిలేక పార్టీ క్రమశిక్షణ కమిటీ సూచన మేరకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చిందని పార్టీ ప్రకటించింది.

ఇక ఈ నిర్ణయం ఆలస్యంగా తీసుకున్న జగన్ అసలు దీన్ని ఆసక్తితో చూశారా? లేక నాయకత్వం లోపాలు బయటపడకుండా చర్య తీసుకున్నట్లేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. దువ్వాడ వ్యవహారం పార్టీకి నష్టం తెచ్చిందని గుర్తించిన జగన్ చివరికి ఓకే చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా, “మరీ ఆలస్యం అయ్యింది?” అనేలా కామెంట్డ్ వస్తున్నాయి. మొదట్లోనే ఈ విషయంలో జగన్ చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని మరికొందరు అంటున్నారు.

డైరెక్టర్ అనురాగ్ పై కేసు |Director Geetha Krishna Reacts On Anurag Kashyap Comments on Brahmins |TR