చంద్రబాబుపై జగన్ సెటైర్లు

చంద్రబాబునాయుడు వ్యవహార తీరుపై జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎంఎల్ఏలు, ఎంఎల్సీల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల అవగాహన తరగతుల కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను ఎత్తి చూపారు.

సభను చంద్రబాబు గతంలో తప్పుదోవపట్టించిన ఉదాహరణలను కూడా జగన్ వివరించారు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు మాదిరిగా అబద్ధాలను చెప్పే నాయకుడు ఇంకోరు లేరంటూ సెటైర్లు విసిరారు. కాబట్టి తమ హయాంలో అసెంబ్లీలో ఎవరు కూడా చంద్రబాబు లాగ అబద్ధాలు చెప్పవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించారు.

సభను తప్పుదోవ పట్టించేట్లుగా కాకుండా  అంశాలపై పూర్తి అవగాహనతో రావాలని సభ్యులకు గట్టిగా హెచ్చరించారు. ప్రతీ ఒక్క సభ్యుడు సమావేశాలకు హాజరవ్వాల్సిందేనని గట్టిగా చెప్పారు. నియమ, నిబంధనలను సభ్యులందరూ తెలుసుకోవాలన్నారు.

ప్రతిపక్షానికి భయపడేవాడిని కానని చెప్పారు. చంద్రబాబు లాగ ప్రతిపక్షంలోని సభ్యులకు మైక్ కట్ చేయటం, ఏదేనా అంశంపై మాట్లాడుతుంటే వ్యక్తిగత దూషణలతో సభలో అల్లరి చేయించి పక్కదోవపట్టించటం లాంటివి మనం చేయాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వంపై టిడిపి ఏమి మాట్లాడినా మైక్ కట్ చేసేది లేదన్నారు. టిడిపి ఏమి మాట్లాడినా సమాధానం ఇచ్చే ధైర్యం మనకుందంటూ ఉత్సాహంగా చెప్పారు.