వృద్దులకు నెలకు 3 వేల పింఛన్ ఇస్తామని సంచలన ప్రకటన చేసిన జగన్

ఏపీలో ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే వైసీపీ, టిడిపి హామీల మీద హామీలిస్తున్నాయి. దీంతో పార్టీల మధ్య పోరు రసకందాయంగా మారింది. తిరుపతిలో జరగిని సమర శంఖారావం సభలో వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో అధికారంలోకి వస్తే వృద్దులకు 3 వేల రూపాయల పింఛన్ ను ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తుండగా ప్రస్తుతం దానిని రెండు వేలకు పెంచారు. దీంతో జగన్ దానిని ఏకంగా మూడు వేల రూపాయలిస్తామని ప్రకటించారు. దీంతో ఏపీలో నేతల మధ్య హామీల యుద్దం నడుస్తోంది.