జమ్మలముడుగు వైసిపి అభ్యర్ధి ఫైనల్

కడప జిల్లాలో కీలకంగా మారిన జమ్మలమడుగులో వైసిపి అభ్యర్ధి ఫైనల్ అయ్యారు. జమ్మలమడుగు పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో డాక్టర్ సుధీర్ రెడ్డినే అభ్యర్ధిగా ప్రకటించారు. చాలా కాలంగా డాక్టరే నియోజకవర్గంలో ఇన్చార్జిగా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసిన ఆది నారాయణరెడ్డి గెలిచారు. కానీ గెలిచిన కొద్ది కాలానికే తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించారు. దాంతో అప్పటి నుండి జగన్ తో పాటు  వైసిపి నేతలు బాగా మండిపోతున్నారు. అందుకే వెంటనే జనాల్లో బాగా పాపులరైన డాక్టర్ సుధీర్ రెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. దానికి తగ్గట్లే సుధీర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.

మాజీ మంత్రి, జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ మైసూరారెడ్డి తమ్ముడి కొడుకే కావటంతో సుధీర్ రాజకీయాల కొత్తమే కాదు. కాబట్టి తొందరలోనే నియోకజకవర్గంలోని నేతలతో పాటు జనాల్లో కూడా చొచ్చుకుపోయారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. అందుకే ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు టిడిపి నేతలు కంట్లో నలుసులా తయారయ్యారు. వైసిపిలో ఎంత క్రియాశీలకంగా పనిచేసినా టిడిపి అభ్యర్ధిని ఓడించటం అంత తేలికేమీ కాదనుకోండి అది వేరే సంగతి.

అయితే, చంద్రబాబునాయుడు పాలనపై జనాలు బాగా మండిపోతున్నారు. ఒకవైపు జగన్ చేసిన పాదయాత్ర మరోవైపు ప్రభుత్వంపై మంట వెరసి టిడిపి అభ్యర్ధి గెలవటం కూడా అంత వీజీ కాదు. కాకపోతే టిడిపి తరపున పోటీ చేయేబోయే అభ్యర్ధిగా చంద్రబాబు రామసుబ్బారెడ్డినే డిసైడ్ చేసేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ప్రధాన రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులు డిసైడ్ అయిపోయినట్లే. మరి జనేసేన తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయంలో అందరూ ఎదురు చూస్తున్నారు.