జగన్ గృహప్రవేశం

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం చేశారు. అమరావతి రాజధాని పరిధిలోని తాడేపల్లి బైపాస్ రెడ్డుకు సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయం, ఇంట్లోకి బుధవారం ఉదయం 8.19 నిముషాలకు ప్రవేశించారు. సతీమణి భారతి సమేతంగా పూజలు నిర్వహించిన జగన్ తల్లి, సోదరి విజయమ్మ, షర్మిల, పార్టీ సీనియరు నేతలతో కలసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇప్పటి వరకూ జగన్ ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుండే చేస్తున్నారు. ఆ విషయంలో విమర్శలు చేయటానికి ప్రత్యర్ధులకు జగన్ అవకాశం ఇచ్చినట్లవుతోంది. ఇదే విషయమై టిడిపి నేతలు జగన్ అండ్ కో పై అనేకసార్లు విమర్శలతో రెచ్చిపోతున్నారు. దానికి తోడు ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్న నేపధ్యంలో విజయవాడకు తరలిరాకపోతే రాబోయే ఇబ్బందులను గ్రహించారు. అందుకనే పార్టీ కార్యాలయంతో పాటు ఇంటిని కూడా నిర్మిచాలని నిర్ణయించారు. దాంతో తాడేపల్లి బైపాస్ రోడ్డు దగ్గర స్ధలం తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టారు. మొత్తం రెండస్తులుగా ఉండే ఈ కాంపౌండ్ లోనే ఇల్లు, పార్టీ కార్యాలయం ఉంటుంది.