ధమ్మున్న ఛాలెంజ్… జగన్ మగడ్రా బుజ్జీ!

నేటి రాజకీయాల్లో సొంత డబ్బా స్టేట్ మెంట్లు, సత్తువలేని సవాళ్లు, లాజిక్ లేని ఛాలెంజ్ లు నిత్య కృత్యంగా సాగుతుంటాయి. అవి ఈ మధ్యకాలంలో ఏపీలో మరీ ఎక్కువైపోయాయి. చోటా మోటా లీడరు కూడా సీఎం స్థాయి వ్యక్తికి ఛాలెంజ్ లు చేయడం ఏపీలో సర్వసాదారణమైన విషయం. పైగా ఆ ఛాలెంజ్ లకు లాజిక్కూ, పాడూ ఏమీ ఉండవు! ఇలాంటి సమయంలో సరైన ఛాలెంజ్ విసిరారు వైఎస్ జగన్!

సాధారణంగా రాజకీయాల్లో ఛాలెంజ్ లు అంటే.. గెలుపోటముల మీద, అవినీతి ఆరోపణలు నిరూపించే విషయం మీదా ఉంటాయి. కానీ.. విచిత్రంగా.. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లోనూ కనీసం పోటీ చేయండి అనే ఛాలెంజ్ తాజాగా వైరల్ అవుతుంది! ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ ఛాలెంజ్ ని చంద్రబాబు – పవన్ లపై చేశారు! దీంతో.. ఇలాంటి ఛాలెంజ్ లు విసరడానికి ధమ్ముండాలనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి!

వివరాళ్లోకి వెళ్తే… తెనాలిలో నాలుగోవిడత వైఎస్సార్ రైతు భరోసా నిధులను జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా… “రాబోయే ఎన్నికల్లో కరువుతో స్నేహం చేసిన చంద్రబాబుకు – మీ బిడ్డకు మధ్య యుద్దం జరుగుతుంది” అంటూ మెల్లగా మొదలెట్టిన జగన్… రాష్ట్రంలో దుష్టచతుష్టయం అనే దొంగల ముఠా ఉంది.. ఆ ముఠాకు ఇప్పుడు దత్తపుత్రుడు కూడా తోడయ్యాడు” అంటూ వేడెక్కించారు. అనంతరం… “దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయండి” అంటూ చంద్రబాబుకు, పవన్ కు జగన్ బహిరంగంగా సవాలు విసిరి.. ఏపీ రాజకీయాల్లో కాకపుట్టించేసారు!

మరి ఈ ఛాలెంజ్ కి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు – “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ హైదరబాద్ లో షూటింగుల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ లు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి!!

YouTube video player