జనసేనాని గుడివాడ పర్యటనలో గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారానికి దారితీస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసహనంతో ఎదురు దాడి చేయటం మొదలు పెట్టారు. కొడాలి నాని తన మీద పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకి తిరిగి కౌంటర్ ఇవ్వటం జరిగింది. అలానే మంత్రి నాని స్పందిస్తూ ఓ రేంజ్లో కౌంటరిచ్చారు. అయితే తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ పవన్కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇవాళ విశాఖలో పర్యటించిన మంత్రి పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంత్రులపై పవన్ వ్యాఖ్యలు దారుణమని వ్యాఖ్యానించారు. ఎన్నో పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో రాజకీయ ప్రముఖుల గురించి తెలుసుకోవాలని సూచించారు. సినిమా ప్రమోషన్ కోసమే పవన్ ఇలా పర్యటనలు చేస్తున్నారని అవంతి మండిపడ్డారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్, లోకేష్తో చెప్పించుకునే స్థితిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేరని మంత్రి కౌంటరిచ్చారు.
నివార్ తుపాన్ నష్ట పరిహారం గురించి మంత్రి మాట్లాడుతూ… వైఎస్సార్ రైతు భరోసా, నష్ట పరిహారంపై అధిష్టానంతో చర్చించామన్నారు. మొత్తం 11 రూపాల్లో రైతులను అదుకుంటున్నామని.. 13 జిల్లాల రైతులు ప్రభుత్వ పథకాలు, తీసుకుంటున్న చర్యలపై సంతోషంగా ఉన్నారన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగితే, నిరూపించమని ఈ సందర్భంగా విమర్శకులకు ఆయన ఒకింత సవాల్ విసిరారు. ఇళ్ల పట్టాలపై సమస్య వస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు. 90 రోజులో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. టీడీపీ నేతల ఆరోపణలు వెనక ఆ పార్టీ అధినేత చంద్రబాబు మైండ్ గేమ్ ఉందని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు.