వారాహి యాత్ర.! ఇంకోస్సారి.! ఆ క్లారిటీ ఇస్తారా జనసేనానీ.?

మలి విడత వారాహి విజయ యాత్రకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాయత్తమయ్యారు. ఏలూరు నుంచి రెండో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభమవుతుందట. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది.

రెండో విడత పాదయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి స్పష్టతనివ్వాల్సి వుంది. పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినెవాతో విడాకులు తీసుకున్నారన్నది జరుగుతున్న ప్రచారం.

తూచ్.. అదేం లేదంటూ, పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల (అన్నా లెజినెవా) కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది జనసేన పార్టీ. అది లేటెస్ట్ ఫొటో అని జనసేన చెబుతోంటే, కాదు కాదంటోంది వైసీపీ.

తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా, తన సతీమణిని మీడియా ముందుకు పవన్ కళ్యాణ్ తీసుకొస్తారని అనుకోలేం. అలా తీసుకొచ్చినా, ఈ గాసిప్స్ మాత్రం ఆగవు. ఇదింతే, ఈ రాజకీయం.. ఈ మీడియా తీరు ఇంతే.

అయినాగానీ, రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న అనుమానాలపై నివృత్తి చేయాల్సిన అవసరం వుంది. ‘నేను అన్నిట్లోనూ క్లీన్‌గా వుంటాను..’ అని పవన్ చెబుతుంటారు మరి.!

జనసేన పార్టీలో కొందరు, ఈ విషయమై జనసేనానికి రకరకాల సలహాలు సూచనలు చేస్తున్నారట. జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఏదైనా పూజ లేదా యాగం నిర్వహించడం, ఏదన్నా దేవాలయంలో సతీసమేతంగా సందడి చేయడం.. వంటివి చేయాలన్నది వారి సూచనల సారాంశం. మరి, పవన్ ఏం చేస్తారో చూడాలిక.!