నేటి నుంచి వారాహి యాత్ర చేపట్టనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. అనంతరం వారాహి వాహనానికి పూజలు నిర్వహంచనున్నారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడి సభకు పవన్ వెళ్తారు. కత్తిపూడిలో నిర్వహించనున్న తొలి బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. అయితే ఈ సందర్భంగా వారాహికి ఒక కొత్త కష్టం వచ్చి పడిందని తెలుస్తుంది.
అవును… గోదావరి జిల్లాల్లో పార్టీకి బలం పెరిగిందని పవన్ పలుమార్లు చెప్పారు. పైగా గోదావరి జిల్లాల్లో పవన్ ఫ్యాన్ బెల్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే అది సినిమాల వరకేనా.. లేక, రాజకీయాలలో కూడా పనిచేస్తుందా అనే చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో… ఆ చర్చకు బలం చేకూర్చే ప్రకటన ఒకటి జనసేన నుంచి విడుదలయ్యింది.
క్షేత్ర స్థాయిలో పార్టీకోసం పనిచేసేందుకు, ఐటీవింగ్ లో పనిచేసేందుకు ఔత్సాహికులైన వాలంటీర్లు కావలెను. ఆసక్తి ఉన్నవారు 9281041479 అనే ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు అని ఉంది. దీంతో… పవన్ కు ఇలాంటి సమస్య ఉందా? అనే చర్చ తెరపైకి వచ్చింది. పవన్ కు ఉన్న ఫ్యాన్స్ జనసేనకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టారా? అనే కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
కాగా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఈరోజు నుంచి మొదలవ్వబోతున్న సంగతి తెలిసింది. యాత్ర ఫస్ట్ ఫేజ్ లో భాగంగా పవన్ 9 నియోజకవర్గాలను కవర్ చేస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి వారాహి దూసుకెళ్లనుంది. అనంతరం కత్తిపూడి సెంటర్ లో తొలి సభ ఏర్పాటు చేశారు. వాహనంపైనుంచే పవన్ ప్రసంగిస్తారు.
As #VarahiYatra begins tomorrow, Volunteers (Ground level, IT, social media etc) who are willing to work for the party please contact : 9281041479#VarahiYatraBeginsTomorrow pic.twitter.com/SbDlxJmJvB
— JanaSena Party (@JanaSenaParty) June 13, 2023