ఖరారైన జనసేన అభ్యర్ధులు: లీక్ అయిన లిస్ట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఇప్పటి వరకు పార్ట్ టైం రాజకీయాలు చేసిన ఆయన 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయనున్నారు. వైసిపి, టిడిపి లకు గట్టి పోటీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రంలో జిల్లాలన్నీ తిరుగుతూ పార్టీకి బలం చేకూర్చే పనిలో పడ్డారు. మరోవైపు జనసేన నుండి ఎన్నికల బరిలోకి దింపే అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టారు పవన్.

ఇప్పటికే జనసేన తరపున పోటీ చేయనున్న మొదటి అభ్యర్థిని ప్రకటించి సంచలనం సృష్టించారు పవన్. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం టికెట్ ను పితాని బాలకృష్ణకు ఖరారు చేసినట్లు ప్రకటించారు. పితాని శెట్టి బలిజ (బిసి)కులానికి చెందిన నాయకుడు. గతంలో ఆయన వైసిపిలో ఉండేవారు. తర్వాత జనసేనలో చేరారు.

కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ ఐంది. రానున్న ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయనున్న ఎమ్మెల్యేలు, ఎంపీల లిస్ట్ అంటూ కొందరి పేర్లు వైరల్ అయ్యాయి. ఆ పోస్ట్ వివరాలు కింద ఉన్నాయి చూడండి.

జనసేన ఎంపీ అభ్యర్థులు దాదాపుగా ఖరారు. బీజేపీకి చెందిన దగ్గుపాటి, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణలు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం.

ఎంపీ అభ్యర్థులు

విజయవాడ
పొట్లూరి వరప్రసాద్

గుంటూరు
లింగమనేని రమేష్

బందరు
సినీ హీరో
నాగేందర్ బాబు

ఏలూరు
తోట చంద్రశేఖర్

ఒంగోలు
దగ్గుపాటి పురందేశ్వరి

కాకినాడ
సోము వీర్రాజు

ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు

కోగంటి సత్యం
విజయవాడ తూర్పు

వంగవీటి రాదా
విజయవాడ సెంట్రల్

జాన్ వెస్లీ
నందిగామ

నాదెండ్ల మనోహర్
తెనాలి

కాజా రాజకుమార్
మైలవరం

లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు 2

ఆకుల సత్యనారాయణ
రాజమండ్రి

దగ్గుపాటి వెంకటేశ్వరరావు
పర్చూరు

 

అయితే, ఈ జాబితాను ధృవీకరించుకునేందుకు ‘తెలుగురాజ్యం’ చేసిన  ప్రయత్నాలు ఫలించలేదు.జనసేన మీడియా ఇన్ చార్జ్ హరిప్రసాద్ ను, సీనియర్ నాయకుడు మాదాసు గంగాధరం ను ఫోన్ లో సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.