జనసేనతో పొత్తు కచ్చితంగా ఉండాల్సిందేనని ఒక వర్గం… లేకపోయినా గెలవచ్చు అని మరోవర్గం… పొత్తు ఉన్నా లేకున్నా ఫలితాల్లో పెద్ద మార్పేమీ ఉండదని ఇంకోవర్గం.. ఇలా రకరకాల అభిప్రాయాలతో బాబును కన్ ఫ్యూజ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. దీంతో జనసేనకు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించారంట చంద్రబాబు. ఆ పరీక్షలో జనసేన ఫాస్ అయితే.. ఫ్యూచర్ లో పొత్తు పెట్టుకుని, అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని జనసేనకు కల్పించాలని.. ఆ టెస్టులో ఫెయిల్ అయితే.. పొత్తు ప్రసక్తి ఎత్తకుండా ముందుకుపోవాలని బాబు ఫిక్స్ అయ్యారంట.
అవును… జనసేనతో 2014లో పొత్తు పెట్టుకుని గెలిచిన చంద్రబాబు & కో… తానే గెలవలేకపోయాడు – ఇంక మమ్మల్ని గెలిపించాడా అంటూ అన్న్ లైన్ వేదికగా పవన్ ని అవహేళన చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటున్న జనసైనికుల్లోని ఒకవర్గం… విజయమో – వీరమరణమో… ఏదైనా ఒంటరిగానే చేద్దామని అంటున్నారట. ఇక మరోవర్గం మాత్రం.. రాజకీయాల్లో అవన్నీ పట్టించుకోకూడదని – అధినేతలిద్దరికీ లేని నొప్పి కార్యకర్తలకు ఎందుకని అంటున్నారట!
ఆ పార్టీ నేతల అభిప్రాయాలు అలా ఉంటే… తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో జనసేన కెపాసిటీకి – జనసేనాని క్యాపబిలిటీకీ ఒక టెస్ట్ పెట్టబోతున్నారట చంద్రబాబు. అదేమిటంటే… ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థికే ఓటు వేయాల్సిందిగా క్యాడర్ కు జనసేనాని సంకేతాలు ఇవ్వాలంట. దీంతో ఇప్పటికే జనసేనాని తన కేడర్ కు అలాంటి సంకేతాలు పంపిందని టాక్!
సో… ఇలా జనసేన సపొర్ట్ చేస్తున్న ఈ ఎమ్మెల్సీ స్థానంలో, ముఖ్యంగా యువకులు ఎక్కువగా ఉన్న పార్టీ అని చెప్పుకుంటున్న జనసేన వల్ల టీడీపీ ఈ టెక్కెట్టు గెలిస్తే… ఫ్యూచర్ లో పొత్తు పక్కా ఉంటుందంట. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే… ఎవరి దారి వారిదేనట! ఈ యాంగిల్ లో ఆలోచించిన చంద్రబాబు… పవన్ కి పెద్దపరీక్షే పెట్టారని కొందరంటుంటే.. ఆమాత్రం పరీక్ష పెట్టకుండానే “పొత్తు జాబ్” ఇచ్చేస్తారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారంట!
మరి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని.. బాబు పెట్టిన ఈ పరీక్షలో నెగ్గి, పవన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటారా.. లేక, ఓడిపోయి ఒంటరిగా పోటీచేస్తారా అన్నది వేచి చూడాలి!
