కేడర్ కొత్త కాన్సెప్ట్: మా నమ్మకం నువ్వే కానీ…!

ప్రస్తుతం ఏపీలో స్టిక్కర్ల పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ విషయంలో మా నమ్మకం నువ్వే జగనన్నా అంటూ ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాతంకంగా మొదలుపెట్టిన కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది. ఈ ప్రోగ్రాం లో వైసీపీ అంటించిన స్టిక్కర్స్ పై… ఆ రోజు సాయంత్రమో, మరుసటిరోజో… తమ స్టిక్కర్లు అంటిస్తున్నారు జనసినికులు – టీడీపీ కార్యకర్తలు! ఈ విషయంలో ఎవరు ముందంటిస్తే.. వారిదే ఫైనల్ చేసుకుంటూ… ఆ రెండు పార్టీలూ ఒక అండర్ స్టాండింగ్ లో పోతున్నాయి. ఆ సమస్య ఒకెత్తు అయితే… తాజాగా వైసీపీకి మరో కొత్త సమస్య ఎదురైంది.

అవును… జనాలకు మరింత దగ్గరవ్వడానికి జగన్ కొత్త కొత్త కాన్సెప్టులు కనిపెడుతుంటే… వాటిని తలదన్నేలా మరింత క్రియేటివిటీ కాన్సెప్టులు రెడీ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. అవును… ప్రస్తుతం ఎమ్మెల్యేల పనితీరుతో విసిగిపోయిన కార్యకర్తల క్రియేటివిటీతో… నియోజకవర్గాల్లోని గోడలు, కరెంటు స్థంబాలూ నిండిపోతున్నాయి. “మా నమ్మకం నువ్వే జగన్ అన్నా అంటూనే… చివర్లో మెలిక పెడుతున్నారు” ప్రస్తుతం ఇదే అధికారపార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా… “మా నమ్మకం నువ్వే జగనన్న, కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పై మాకు నమ్మకం లేదు” అంటూ ఒక పోస్టర్లు వేశారు కొంతమంది కార్యకర్తలు. రాజంపేటలో కరెంట్ స్థంబాలపైనా, స్థానిక టిఫిన్ బండ్లపైనా, జనం రద్దీగా ఉండే రోడ్లపక్కనున్న గోడలపైనా… ఈ వాల్ పోస్టర్లు వేశారు. సీఎం జగన్ పై తమకు నమ్మకం ఉందని చెబుతూనే.. పరోక్షంగా ఆ ఎమ్మెల్యే తమకు వద్దు అంటున్నారంటే… ఎమ్మెల్యేని మార్చేయాలనేదే వారి ఉద్దేశం అని స్పష్టంగా అర్ధమవుతుంది. దీంతో… ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వ్యతిరేక వర్గం ఈ పోస్టర్లు వేసినట్టు చెబుతున్నారు. అయితే… ఈ పోస్టర్ లో… “మోసపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు” అంటూ పోస్టర్ల కింద రాయడం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం!

ఇదే క్రమంలో… గతంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కు వ్యతిరేకంగా కూడా పోస్టర్లు వెలిసి స్థానికంగా కలకలం రేపాయి. మరి ఇలా క్రియేటివిటీగా పుట్టుకొస్తున్న సిట్టింగుల వ్యతిరేకతపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారు.. డైరెక్ట్ ఉధ్వాసనేనా లేక పిలిచి మాట్లాడతారా అన్నది వేచి చూడాలి!