అనుకున్నంతా అయ్యింది. భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడపోయాడు. త్రిముఖ పోటీ జరిగిన భీమవరంలో ఏ దశలో కూడా పవన్ పోటీ ఇవ్వలేకపోయారు. ఇక్కడి నుండి జనసేన తరపున పవన్ పోటీ చేశారు. వైసిపి తరపున గ్రంధి శ్రీనివాస్ పోటీ చేయగా టిడిపి అభ్యర్దిగా పులవర్తి ఆంజనేయుడు పోటీ చేశారు.
మొదటి నుండి కూడా ఇక్కడ పవన్ ను మిగిలిన ఇద్దరు అసలు పోటీ అనే అనుకోలేదు. ఎందుకంటే, నామినేషన్ వేసిన తర్వాత పవన్ ఒక్కసారి కూడా భీమవరంలో ప్రచారానికి కూడా రాలేదు. అదే సమయంలో టిడిపి, వైసిపి అభ్యర్ధులిద్దరూ బలమైన వారే కావటం గమనార్హం.
అందుకే పోటీ మొదటి నుండి కూడా టిడిపి, వైసిపి అభ్యర్ధుల మధ్యే నడిచింది. ముగ్గురు కాపు అభ్యర్ధులే కావటంతో కాపుల ఓట్లు ఇక్కడ చీలిపోయాయి. కాకపోతే కాపేతర ఓట్లు అంటే బిసిలు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, ఎస్పీల ఓట్లలో మెజారిటీ వైసిపికి పడటంతో గ్రంధి శ్రీనివాస్ గెలుపు సులువైంది. గాజువాకలో ఓటమి దిశగానే ప్రయాణం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. మొత్తానికి మార్పన్నాడు, కొత్త తరహా రాజకీయమన్నాడు. చివరకు ఓటమి మూటకట్టుకున్నారు.
