పవన్ కళ్యాణ్ ట్వీటు: ఆనంద సాగరంలో అభిమానులు.!

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా అరుదుగా మాత్రమే ట్విట్టర్‌లో ఆయా అంశాలపై స్పందిస్తుంటారు.. చెప్పాలనుకున్నది చెబుతుంటారు. ఎక్కువగా రాజకీయ పరమైన అంశాల గురించే పవన్ కళ్యాణ్ ట్వీట్లు వేస్తుంటారు.. రాజకీయ ప్రత్యర్థులకు ధీటైన సమాధానమిస్తుంటారు.

కానీ, ఓ అభిమాని ట్వీటుకి జనసేనాని స్పందించారు. అంతేనా, ఆ అభిమానిని అభినందించారు. జనసేన పార్టీ కోసం నిలబడినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఎవరా అభిమాని.? ఏమా కథ.? అంటే, ఆ అభిమాని ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. ఎందుకంటే, ఆ అభిమాని ట్విట్టర్ అకౌంట్‌లో అసలెలాంటి వివరాలూ లేవు.

మొట్టమొదటి అభిమానివి నువ్వే..

ఇంతకీ, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించారు.? అంటే, జనసేన పార్టీకి ఆ అభిమాని విరాళం ఇచ్చాడు గనుక.. అన్నది స్పష్టమవుతోన్న విషయం. కానీ, అలాంటి వేలాది మంది.. లక్షలాదిమంది అభిమానులు తమకు తోచినంత మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళాలు ఇస్తూ వస్తున్నారు. వారెవరికీ పవన్ కళ్యాణ్ ఇలా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది లేదు.

దాంతో, ‘నువ్వు చాలా అదృష్టవంతుడివి బ్రో.. నువ్వే తొలి అభిమానివి పవన్ కళ్యాణ్ నుంచి థ్యాంక్స్ అందుకోవడంలో..’ అంటూ పవన్ అభిమానులు పేర్కొంటున్నారు. నిజానికి, ఇలాంటివి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.

జనసేనకి ఎవరైనా విరాళం అందిస్తే, ఆ పార్టీ తరఫున ఆటో జనరేటెడ్ మెసేజ్ వెళుతుంది. కానీ, ఇలా పవన్ నుంచి ట్వీట్ రావడమంటే వెరీ వెరీ స్పెషల్ మరి.!