వైసీపీ నేతలతో తిట్టించుకోని పక్షంలో పవన్ కళ్యాణ్ కు నిద్ర పట్టదా?

pawann ca

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ లో మాట్లాడినా సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా అందరి దృష్టి తనపై ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరో కావడంతో సాధారణ ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే తన సభలకు వచ్చిన వాళ్లంతా తనకు ఓట్లేస్తారని భ్రమలో బ్రతికిన పవన్ కళ్యాణ్ ఆ భ్రమల వల్లే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు.

వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా చేయాలనే ఒకే ఒక్క ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ ఏడాదిలో సంపాదించిన గుర్తింపును పది నెలల్లో సంపాదించుకోలేకపోయింది. చేతిలో మైక్ ఉంటే చాలు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు అడ్డూఅదుపు ఉండదు. పవన్ తలచుకుంటే ఆయన రాష్ట్రానికి సీఎం కావడం సాధ్యమవుతుందా? అలా అయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవలేదని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేలా కామెంట్లు చేయడం వాళ్లతో తిట్టించుకోవడం పవన్ కళ్యాణ్ కు సరదానా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతలతో తిట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ కు నిద్ర పట్టదా? అని మరి కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అదేదో సామెతలా పవన్ కళ్యాణ్ కు టీడీపీనే గొప్ప పార్టీలా కనిపిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల్లో పార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉందో పవన్ కళ్యాణ్ గమనిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్లను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ఇదే విధంగా కామెంట్లు చేస్తే 2024 ఎన్నికల ఫలితాల తర్వాతే పవన్ కళ్యాణ్ కు వాస్తవాలు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది.