కళ్లు తిరిగి పడిపోయిన పవన్ కల్యాణ్, హాస్పటిల్ కు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయన కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే, పవన్ ని వైద్య చికిత్స నిమిత్తం ఆయుష్ ఆసుపత్రికి ఆయన సిబ్బంది తరలించారు. విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. కాగా, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో, తెనాలిలో పవన్ పర్యటనలు రద్దయినట్టు సమాచారం.

అంతకు ముందు ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వేదికపైనే కిందపడిపోయారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది. విజయనగరం జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడేందుకు సన్నద్దమౌతున్న సమయంలోనే వెనుక నుండి వచ్చిన ఓ అభిమాని పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ స్టేజీపైనే కిందపడిపోయాడు.

ఈ ఘటన కారణంగా మైక్ కూడ విరిగిపోయింది. పవన్ భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే పైకి లేపారు. వపన్ అభిమానిని అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.