జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ఏ జిల్లాలో కూడా ప్రజలు సంతోషంగా లేరని రైతులు కంటతడి పెట్టిన నేలలు సుభిక్షంగా ఉండవని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో రైతులను, రైతు సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన కామెంట్లు చేశారు. కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల సాయం చేసిన తర్వాత పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అవుతానని పవన్ పరోక్షంగా తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను వారానికి ఒక్కరోజు వస్తేనే వైసీపీ వాళ్లు తట్టుకోలేకపోతున్నారని ఆయన కామెంట్లు చేశారు. నా కష్టార్జితంతో రైతులకు సహాయం చేస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు తన దగ్గర లేదని పవన్ కామెంట్లు చేశారు.
కాపుల గుండెల్లో కుంపటి అంబటి అంటూ పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ, బీజేపీలకు తాను అమ్ముడుపోలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వననే మాటకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని పవన్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటోందని పవన్ తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ భవిష్యత్తు అంధకారం అవుతుందని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. పవన్ వెల్లడించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నేను సీఎం అవుతానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. పవన్ పొలిటికల్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.
