“ఓటమి పాఠాలు నేర్పుతుంది “- పవన్ కళ్యాణ్
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ కి ఊహించని పరాజయం ఎదురైంది . జన సేనాని పవన్ రెండు చోట్ల పోటీచేసి ఓటమి పాలయ్యారు . జనసేన పార్టీకి ఒకే ఒక్క శాసన సభ్యుడు గెలుపొందాడు .. సినిమా రంగంలో ఎదురులేని హీరోగా వున్న పవన్ కళ్యాణ్ కు ఇది పెద్ద దెబ్బే . రాజకీయరంగంలో ఇలాంటి అపజయం ఎదురయినప్పుడు పవన్ అక్కడ ఉండదని మళ్ళీ తనకిష్టమైన సినిమా రంగంలోకి వస్తాడని చాలామంది జ్యోస్యం చెప్పారు . అయినా సినిమా గురించి పవన్ మాట్లాడటం లేదు . రాజకీయాల్లో వుంది డబ్బుకు ఇబ్బంది పడుతున్నా రాజకీయాలను వదిలి పెట్టనని చెబుతున్నాడు .
ఆంధ్ర ప్రదేశ్లోనే ఉంటూ జనసేన బలోపేతానికి కృషి చేస్తున్న పవన్ తాజాగా తాను ఓడిపోవడం మంచిదేనని చెప్పాడు . రాజమండ్రి నుంచి వచ్చిన జనసేన నాయకులతో బుధవారం నాడు పవన్ సమావేశమయ్యారు . తాను ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవడం వల్లనే ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడానికి అవకాశం కలిగిందని పవన్ చెప్పాడు . సమర్ధత లేని నాయకుల వల్లనే అపజయం కలిగిందని , అయినా ధైర్యంతో ముందుకే వెడుతున్నానని చెప్పాడు . 2014 ఎన్నిక సందర్భంగా కొంతమంది నాయకులు జనసేన పార్టీని వేరే పార్టీలో విలీనం చెయ్యమని సలహా ఇచ్చారని , అయితే తాను పాటించలేదని తెలిపాడు
.
ఎన్నికల సందర్భంగా తాను అమలు చెయ్యలేని , ఆచరణ సాధ్యం కానీ వాగ్ధానాలు చెయ్యలేదని , ఒకవేళ ప్రజలను ప్రలోభపెట్టి అలాంటి వాగ్ధానాలు చేసివుంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చేదని పవన్ తెలిపాడు . ప్రస్తుత శాసన సభ గురించి ప్రస్తావిస్తూ .. నాయకుల ప్రవర్తన ఎలా ఉందొ అందరూ చూస్తున్నారు .. సభలో ఒకరినొకరు కొట్టుకోవడం ఒక్కటే తక్కువని పవన్ వ్యాఖ్యానించాడు తన దగ్గర ఆశయం తప్ప డబ్బు లేదని ,అయినా ఎదో ఒక రోజు అందరి దృష్టి తన మీదా ఉంటుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశాడు . .
