భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటి.. ప్రకటించిన జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ పట్నం జిల్లా గాజువాక స్థానాల నుంచి పోటి చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. పార్టీ మీటింగ్ లో పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం స్థానాలు పరిశీలనకు వచ్చినా పవన్ చివరకు గాజువాక, భీమవరం నుంచి పోటి చేసేందుకు అంగీకరించారని తెలుస్తోంది. పవన్ నామినేషన్ దాఖలు తేదిపై రేపటిలోగా క్లారిటి వచ్చే అవకాశం ఉంది.