పెద్దిరెడ్డికి గుడ్ న్యూస్… కుప్పంలో భారీగా ఎన్టీఆర్ కటౌట్లు!

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి ఉన్న శత్రువుల లిస్ట్ లో ఒక పేరు ప్రముఖంగా వచ్చి చేరిందని.. ఈసారి ఆ పేరు ప్రభావం ఎక్కువగానే ఉండబోతోందని అంటున్నారు పరిశీలకులు. ఆ పేరే జూనియర్ ఎన్టీఆర్. ఈసారి ఆయన అభిమానులు, నందమూరి అభిమానులు.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. పైగా కుప్పంలో మరింతగా ప్రభావం చూపినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది.

అవును… రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకి ప్రత్యేకించి కుప్పంలో గట్టి దెబ్బే తగిలేట్లుందని తెలుస్తోంది. ఆ దెబ్బలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హస్తం కూడా అధికంగానే ఉంటుందని అంటున్నారు. తాజాగా కుప్పంలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్ని బలపరుస్తోందని అంటున్నారు.

తాజాగా… కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లు భారీగా వెలిశాయి. వాటన్నింటి మీద “కాబోయే సీఎం జూనియర్” అని రాసుంది. చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చినపుడల్లా జూనియర్ అభిమానులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం కుప్పానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు.

చంద్రబాబు ర్యాలీల్లోనూ, బహిరంగసభల్లోనూ “జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్” అని అరుస్తూ, జేజేలు కొడుతు, కాబోయే సీఎం అని పదేపదే గోల చేస్తుంటారు. అయితే ఈ విషయాలు బాబుకు అత్యంత చికాకును కలిగిస్తాయనడానికి ఎన్నో ఉదహారణలు ఉన్నాయి. ఈమధ్యకాలంలో గుడివాడ, మచిలీపట్నంలలో బాబు ఎదుక్రొన్న ఇబ్బందుల సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు కుప్పంలో టీడీపీ తరపున ఎలాంటి పొలిటికల్ యాక్టివిటి లేకపోయినా నియోజకవర్గంలో కొన్నిచోట్ల జూనియర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఎక్కువగా వెలిశాయి. అయితే దీనికి కారణం రాజకీయాలు కాదు.. ఒక పండుగ కారణం అని తెలుస్తోంది. అయితే కారణం ఏదైనా, సందర్భం మరేదైనా… జూనియర్ ఫ్లెక్సీలు కనిపిస్తే బాబుకు కొత్త టెన్షన్స్ పట్టుకుంటున్నాయని అంటున్నారు.

ఇంతకీ ఆ ఫ్లెక్సీలు ఎందుకు వెలిశాయో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు-కర్నాటక బార్డర్స్ లో ఉండే కుప్పంలో ఆడికృత్తిక పండుగ మొదలైంది. ఆడికృత్తికను తమిళులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని జనాలు గుళ్ళకు వెళ్ళి ప్రత్యేక పూజలు, జాతరలు జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగానే అభిమానులు గ్రామాల్లో జూనియర్ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు.

దీంతో రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవనే అనుమానాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో జూనియర్ అభిమానులంతా రాబోయే ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగానే ఓట్లే వేస్తారనటంలో సందేహంలేదని చెబుతున్నారు. జూనియర్‌ ను కావాలనే చంద్రబాబు పార్టీకి దూరంగా పెడుతున్నారన్న కోపం అభిమానుల్లో బలంగా ఉందని తెలుస్తోంది.

దీంతో చంద్రబాబుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ కోపంతో ఉన్నారు. ఆ కోపంతోనే ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు పర్యటన జరిగిన ప్రతిసారి కటౌట్లు, ఫొటోలతో రచ్చరచ్చ చేస్తున్నారు. దీంతో రేపటి ఎన్నికల్లో వీళ్ళంతా కచ్చితంగా చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగానే ఓట్లేసే అవకాశముందని అంటున్నారు పరిశీలకులు.

కాగా… ఈసారి కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని జగన్ బలంగా ఫిక్సయిన సంగతి తెలిసిందే! ఈ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారని అంటుంటారు. ఇందులో భాగంగా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి వరుస పర్యటనలు చేస్తూ ఉంటారు. దీంతో… కుప్పం విషయంలో పెద్దిరెడ్డికి జూనియర్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెబుతున్నారని అంటున్నారు!