పవన్ పై బురద జల్లబోయిన మీడియా, డైరక్టర్ మారుతి కౌంటర్

పవన్ కళ్యాణ్ పై బురదజల్లే ప్రయత్నం చేసిన ఓ మీడియా సంస్దకు కౌంటర్ ఇచ్చి మెగాభిమానం చాటుకున్నారు దర్శకుడు మారుతి. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును విజయవాడలో వినియోగించుకున్నారు. అయితే ఆయన క్యూలో నిలబడి ఓటేయ్యలేదని ఓ మీడియా ఛానెల్ హైలెట్ చేయబోయింది.

అక్కడ క్యూలో ఉన్న జనాలను ఇబ్బందికు గురి చేస్తూ నేరుగా వెళ్లి ఓటేసారని పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అక్కడున్న ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేసారు. ఈ విషయం దర్శకుడు మారుతి దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

మారుతి ఆ కౌంటర్ లో ..దయచేసి ఇలాంటి విషయాలను సంచలనం చేయకండని అన్నారు. పవన్ లాంటి వ్యక్తి క్యూలో నిలబడే పరిస్థితి ఉంటుందా..? అని మారుతి ప్రశ్నించాడు. అలా చేస్తే మరిన్ని సెక్యురిటీ సమస్యలు వస్తాయని అన్నారు.

పవన్ క్యూలో నిలబడి ఓటేస్తే అక్కడ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుందని కాబట్టే ఆయన ఓటు వేసి వెళ్లిపోయారని మారుతి చెప్పారు. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రం వద్ద ఓ యువకుడు చెబుతుంటే సదరు మీడియా ప్రతినిధి అతడి వాయిస్ ని మధ్యలో కట్ చేసింది. అలా ఎందుకు చేశారని కూడా మారుతి ప్రశ్నించారు.