దుమ్ము లేపుతున్న లోకేష్ వీడియో: మీరూ చూడండి

జగన్ పై దాడి కేసులో రాష్ట్రంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు నిందితుడు మీవాడంటే మీవాడంటూ వాద ప్రతివాదనలు చేసుకుంటున్నాయి. అది ప్రూవ్ చేయడానికి ఇరు పార్టీలు రకరకాల ఫోటోలు, వీడియోలు తెరపైకి తెస్తున్నారు.

ఈ నేపధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ మినిస్టర్ లోకేష్ కూడా వైసీపీ మార్ఫింగ్ చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఐంది. టీడీపీ అభిమానులు షేర్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో దుమ్ము లేపుతోంది. లోకేష్ ట్వీట్ మరియు వీడియో కింద ఉంది చూడండి.

వైకాపా ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్. దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ మోడీ రెడ్డి. తన అభిమానిని టీడీపీ కార్యకర్తగా సృష్టిస్తూ చీప్ ఫోటోషాప్ జిమ్మిక్కులు. కింద ట్విట్టర్ లింక్ లో వీడియో చూడండి.

https://twitter.com/naralokesh/status/1056512237156745216

కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గం లోనిది అంటూ ఫేక్ మెంబెర్ షిప్ కార్డు తయారు చేసారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ మోడీ రెడ్డి తప్ప మరొకరు ఉండరు. #జగన్నాటకం