అమరావతిలో లోకేష్ దంతా రహస్య పరిపాలన, ఇదిగో సాక్ష్యం

(PK)
 
పారదర్శకతకు తామే నిలువుటద్దమని, దేశంలో అందరికీ తమ కుటుంబం ఆదర్శమని గొప్పలకు పోతుంటారు   అమరావతి పెదబాబు తనయుడు చినబాబు.  దీనికి తార్కాణమంటూ సంవత్సరానికొక సారి తమ కుటుంబ ఆస్తిపాస్తులు విడుదల చేసి టామ్ టామ్ చేస్తుంటారు. అయితే, అమరావతిలో సాగుతన్న పాలన చూస్తే చంద్రబాబు, చిన్నబాబు ప్రభుత్వంలో ఉండే పారదర్శక బూటకమని అర్థమవుతుంది. 
 
తమ కుటుంబ ఆస్తులతో సహా తమది అన్నింటా తెరిచిన పుస్తకమని  స్వయంగా చెప్పే ఐటి,పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధఇ శాఖ మంత్రి లోకేష్ నాయుడు నిన్న ఒక్క రోజే 33 జీవో రహస్య జీవొలు విడుదల చేశారు.  ఒక్కరోజే అన్ని రహస్య జీఓలు జారీ చేయడం వెనుక ఏ గూడు పుఠాణీ ఉందో అనే  అనుమానాలు రాజధానిలో సర్వత్రా  వ్యక్తమవుతున్నాయి. 
 
లోకేష్‌ నిర్వహిస్తున్న మూడు శాఖల్లో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం 36 జీఓలు జారీ చేసింది. వాటిలో మూడు మాత్రమే ప్రజలు చూసేందుకు వెసులుబాటు కల్పించారు. ఇవి మాత్రమే పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి.  మిగిలిన 33 జీఓలను కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌లో పెట్టి ఎవరూ చూసే అవకాశం లేకుండా చేశారు.  ఎందుకంత గోప్యం. జీవొ అంటే పబ్లిక్ డాక్యుమెంట్. అయినా సరే జీవోలన్నింటిని రహస్యంగా ఉంచారు.
 
న్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇలా భారీగా రహస్య జీఓలు జారీ చేయడం ఏమిటనే దానికి లోకేష్‌ మంత్రిత్వ శాఖలో అధికారులెవరూ నోరు మెదపడంలేదు. 
 
చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాలుగున్నరేళ్లలో ఊహించనన్ని రహస్య జీఓలు జారీ చేసింది. ఇప్పటివరకూ వీటి సంఖ్య పది వేలకు మించిపోయి ఉంటుందని సీఎం కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. 
 
ఇటీవల సీబీఐ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఉండేందుకు జనరల్‌ కన్సెంట్‌ను ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీఓ కూడా రహస్య జీఓనే. కాన్ఫిడెన్షియల్‌ జీఓ కావడం వల్లే దాని గురించి ఎవరికీ తెలియలేదు. కానీ ఏమనుకున్నారో తెలియదు కానీ వారంరోజుల తర్వాత ఆ జీవో గురించి తమకు అనుకూలంగా ఉండే పత్రికల్లో రాయించుకుని పబ్లిక్ చేశారు. 
 
సాధారణంగా రాష్ట్ర భద్రత లేదా చాలా సున్నితమయిన  సమాచారం ఇతరులకు తెలియకూడదనుకున్న సమయాల్లోనే కాన్ఫిడెన్షియల్‌ జీఓలు జారీ చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అలాంటి కోవలోకి వచ్చే జీఓలు చాలా తక్కువగా ఉంటాయి. 
 
అయినా చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా జీఓలు జారీ చేయడం వెనుక చాలా మతలబులు ఉంటున్నట్లు ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవోలో ఉన్న అంశాలు ప్రజల్లోకి వెళితే తమకు ఇబ్బందులు వస్తాయనే భయంతో చాలావరకూ జీఓలను కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుటున్నారు. మిగిలినవాటిలో చాలావరకూ కాంట్రాక్టులు, నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినవి కావడంతో వాటిని బయటపెట్టడంలేదని అనుకుంటున్నారు.
 

దీన్నిబట్టే ఏపీలో పాలన ఎంత పారదర్శకంగా జరుగుతుందో అర్థమవుతోంది.