వివేకా హత్య వార్త విని పరవశించిపోయారట (వీడియో)

నారా లోకేష్ కు చంద్రబాబునాయుడు పుత్రరత్నం అని తప్ప మరే గుర్తింపు లేదు. అందుకే దొడ్డిదోవన ఎంఎల్సీ అయిపోయి మంత్రి కూడా అయిపోయారు. మాట్లాడటం కూడా రానీ లోకేష్ రాష్ట్రానికి మంత్రవ్వటం నిజంగా ఖర్మే. అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా చెప్పి నవ్వులపాలయ్యారు. అలాగే టిడిపికి ఓటేస్తే మనకు మనం ఉరి వేసుకున్నట్లే అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. చెప్పుకుంటూ పోతే లోకేష్ నోట జాలువారిని ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి.

తాజాగా ఎన్నికల ప్రచారంలో కూడా అటువంటి ఆణిముత్యాన్నే వదిలారు లోకేష్.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతూ, వివేకా హత్య వార్త విని తాను పరవశించిపోయినట్లు చెప్పారు. లోకేష్ చెప్పిన మాట విని ఒక్కసారిగా అందరూ నివ్వెరపోయారు. వివేకా హత్యతో రెండు పార్టీల మధ్య మంటలు రేగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి కీలక అంశంపై ఎంత జాగ్రత్తగా మాట్టాడాలో కూడా తెలీని లోకేష్ నోటికేదొస్తే అంత మాట్లాడేయటం మన ఖర్మ కాకపోతే మరేంటి.