ప్రముఖ సినీ నటుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు రెండవ భార్య, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన ప్రకటన చేశారు. 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధత రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు లక్ష్మీ పార్వతి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలవుతున్ననేపధ్యంలో ఆమె తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె రానున్న ఎన్నికల్లో ఆమె పోటీపై స్పష్టత ఇచ్చారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
2014 ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ ది, తనది ఒకే అజెండా అని, చంద్రబాబు నాయుడుని ఓడించడమే వారి లక్ష్యమని అందుకే ఆమె వైసీపీలో చేరినట్టు తెలిపారు. ఆమె పార్టీలో చేరడాన్ని జగన్ కూడా ఆత్మీయంగా స్వీకరించారు. పార్టీలో చేరిన అనతి కాలంలోనే ఆమెకు వైసీపీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చి గౌరవించారు. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి వైసీపీ ప్రధాన కార్యదర్శిగానే కొనసాగుతున్నారు.
కాగా గత కొంతకాలంగా రానున్న ఎన్నికల్లో ఆమె పోటీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె కచ్చితంగా ఎన్నికల బరిలోకి దిగుతారని భావించారు. ఆమె కృష్ణా జిల్లాలో ఏదొక నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేస్తారంటూ ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ ఈ ఉహాగానాలన్నిటికి తెర దించుతూ ఆమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆమె పోటీపై క్లారిటీ ఇచ్చేసారు.
శుక్రవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్ ప్రారంభంగా ఆమె తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లారు. స్వామిని దర్శించుకుని వస్తుండగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా…ఆమె పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్న లక్ష్మీ పార్వతి గెలుపు కోసం వైసీపీకి మద్దతుగా తాను ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. లక్ష్మి పార్వతి ఎన్నికల్లో పోటీ చేయాలనీ ఆశించిన ఆమె వర్గీయులకు నిరాశ మిగిలింది.
