చంద్రబాబు అందుకే అలా చేస్తున్నాడట !

Chandrababu Naidu did wrong thing

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుంది అని , తాను కాక ఇంకెవరు సీఎంగా ఉన్నా కూడా రాష్ట్రం వెనక్కి వెళ్లిపోతుందన్న భ్రమలో బ్రతుకుతుంటారని కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఎన్నో పనులు ముఖ్యమంత్రిగా
వై ఎస్ జగన్ చేస్తూంటే ఓర్వలేక చంద్రబాబు అక్కసుతో , అసహనంలోకి వెళ్లి అర్థం పర్థం లేని అనవసర‌ విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Did Jagan and Chandrababu surrender to the Center?

బాబుది వక్ర బుద్ధి అందుకే జగన్ మీ భూమి మా హామీ అంటూ వందేళ్ల తరువాత సమగ్ర భూ సర్వేను జగన్ చేపడితే అందులో తప్పులు ఎంచడానికి చంద్రబాబు తాపత్రయపడుతున్నాడని విమర్శించారు. పేదలందరి భూములకు శాశ్వత‌ హక్కులు కల్పించాలని, వారంతా బాగుండాలని జగన్ తపన పడుతూంటే బాబు మాత్రం తన అనుచరుల భూముల భూములకు అమరావతిలో రేట్లు ఎక్కడ పడిపోతాయోనని ఆందోళన పడుతున్నారని అన్నారు.

ఏపీలోనే కాదు దేశంలోనే ముప్పయి లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం చరిత్రలో ఎక్కడా లేదని ,బాబు సహా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు అన్నీ కూడా అవాస్తవాలు అన్నది జనానికీ తెలుసు అంటూ చురకలు అంటించారు.ఏదేమైనా మొత్తంగా జగన్ చేస్తున్న అభివృద్ధి ని చూసి చంద్రబాబు లో అసహనం రోజురోజుకి పెరిగిపోతుంది అంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు.