బీజేపీని గట్టిగా ఇరికించేసిన జనసేనాని పవన్ కళ్యాణ్.!

వైసీపీ వైపు వెళతారా.? టీడీపీ, జనసేనతో కలుస్తారా.? భారతీయ జనతా పార్టీ ముందున్న ఆప్షన్ ఏంటి.? అసలంటూ ఆప్షన్ లేకుండా బీజేపీని ఇరకాటంలో పడేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

కొన్నాళ్ళ క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ ‘షణ్ముఖ వ్యూహం’ అంటూ ఓ ప్రకటన చేసిన విషయం విదితమే. ఆ వ్యూహం గురించి అప్పట్లో ఏవేవో చెప్పారాయన. కానీ, ఇప్పుడు ఆ వ్యూహాన్ని ఇంకో కోణంలో, కొత్త కొత్త ఆలోచనలతో జనసేనాని అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

2024 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేనాని ప్రకటించేశారు. నిజానికి, ఈ ప్రకటన టీడీపీ, బీజేపీ అగ్రనేతలతో కలిసి జనసేనాని చేయాల్సి వుంటుంది. ఉమ్మడి ప్రకటన అయితేనే, ఈ కాంబినేషన్‌కి విలువ, గౌరవం.

కానీ, జనసేనాని తనంతట తానుగా ప్రకటించేయడం వల్ల బీజేపీనే ఇబ్బంది పడాల్సి వస్తోందిప్పుడు. టీడీపీ ఎలాగూ, జనసేనతో పొత్తునికోరుకుంటోంది కదా.! సో, టీడీపీకి ఇబ్బంది లేదు. బీజేపీకి జనసేన కావాలి. కానీ, టీడీపీతో కలిసేందుకు బీజేపీ ససేమిరా అంటోంది.

సో, ఆ బీజేపీ ఎలాగైనా టీడీపీ వైపుకు రావాల్సిందేనని జనసేనాని తనదైన స్టయిల్లో ప్లాన్ చేశారు. అయితే, బీజేపీ.. జనసేన మాటకి తలొగ్గుతుందా.? అన్నది మాత్రం తేలాల్సి వుంది.