సెన్సేషనల్ రహస్యం బయటపెట్టిన పవన్

నిన్న రాత్రి జరిగిన ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సంచలన రహస్యం వెల్లడించారు. 

ఆయన్ని చంపేసే కుట్రొకటి జరుగుతూ ఉందని ఆయన చెప్పారు.

‘‘కొంతమంది నాయకులు నన్ను చంపేస్తే అసలు సమస్య ఉండదు కదా అని మాట్లాడుకున్న వాయిస్ క్లిప్ తన దాక వచ్చింది, అది ఎవరో కూడా తెలుసు నాకు. నన్ను చంపేసి అధికార, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు తోసుకుని అడ్డు తొలగించుకోవాలని…, భయపెట్టాలని చూస్తున్నారు, ’ అని పవన్ వ్యాఖ్యానించారు.

ఆయన ఇంకా ఏం చెప్పారంటే…

నిడదవోలు వెళ్ళినప్పుడు ఒక పెద్దావిడ వచ్చి నన్ను హత్తుకుంది, వారిని కౌగిలించుకుని నేనున్నాను అంటే సరిపోతుందా.. చాలదు., కావున వారికి వృద్ధాశ్రమాలను జనసేన కట్టిస్తుంది. దివ్యాంగులకు 5000 రూపాయల పెన్షన్ అందిస్తాం. స్వర్గం అనేది తల్లిపాదాల చెంత ఉంటుంది అని గొప్ప విషయాన్ని భోదించిన మతం ఇస్లామ్. ఎవరో కొంత మంది చేసిన తప్పులకు అందరిని అనటం సరి కాదని ఆయన అన్నారు..

ప్రతి మతంలో కొందరు తప్పులు చేసే వాళ్ళు ఉంటారని పవన్  అన్నారు.

అగ్రవర్ణాల పేదలందరికి కలిపి ఒక కార్పొరేషన్ పెట్టి ముఖ్యంగా విద్యార్థులకు అండగా నిలబడి, వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని పవన్ హామీ ఇచ్చారు.

రిజర్వేషన్లు అన్ని కులాల వారు అడుగుతున్నారని…, పేదలు అన్ని వర్గాల్లో ఉన్నారు, ఒక కులానికి రిజర్వేషన్లు పరిమితం కాలేవని కూడా  పవన్ అన్నారు.

‘నేను అరకు వెళ్ళినప్పుడు నా బండి ఆపి  అక్రమ మైనింగ్ చూపించారు. అక్కడ నీటి గడ్డలు కలుషితం అవుతున్నాయని చెప్తే ప్రభుత్వం వినిపించుకోలేదు, అదే ఈరోజు నక్సలైట్ల చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రాణాలుపొగొట్టుకున్నారు.

ఒక పెద్దాయన మొన్న ఎవరితోనో ఒక మాట  అంటున్నారు- టూరింగ్ టాకీస్ ఉన్న ప్రతి ఊర్లో, సినిమా చూసే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అర్థమయ్యాడు కానీ రాజకీయ నాయకులకి మాత్రం అర్థం కాలేదని.

‘నాకు జగన్ లాగా ఇప్పుడే ముఖ్యమంత్రి అవ్వాలని గానీ, లోకేష్ లాగా వారి తండ్రిని కేంద్రానికి పంపి తాను ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనలు లేవు, నేను సమస్యలపై పోరాడుతూ పదవులు వస్తే ఆనందంగా సేవ చేస్తానని,’  పవన్  స్పష్టం చేశారు.