పవన్ రాయలసీమ కొస్తున్నాడు…సీమ మనుసు దోచుకుంటాడా?

Pawan Kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనుకు బయలు దేరుతున్నారు. ఆయన ఇంతవరకు రాయలసీమ జిల్లాల్లో పర్యటించలేదు. ఒక్క అనంతపురం జిల్లాకు మాత్రం వచ్చారు. తిరుపతికి ఎపుడో ఒక సారి వచ్చారు. దీనితో రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శ ఉంది. ఇపుడాయన మొట్టమొదటి సారి గా కడప కర్నూల్ జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఒక్కొక్క జిల్లాలో మూడేసి రోజులుంటారు.పవన్ పొలిటిక్ ప్రోగ్రాంలో ఎందుకో రాయలసీమకు  పెద్ద గా స్థానం దొరకలేదు. రాయలసీమ రాజుకుంటుందున్నవిషయం ఆయన గ్రహిస్తున్నారో లేదు. ఈ విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి.

ఎందుకంటే, కొత్త విమానాశ్రయాలు, కియా కార్ల ఫ్యాక్టరీ చూపి తాను రాయలసీమను అభివృద్ధి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఆయన  విపరీతంగా ఈ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. జగన్ కూడా ఏ మాత్రం తీసిపోకుండా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

అయితే, వీరెవరూ రాయలసీమ అసలు సమస్య ( కోర్ ఇష్యూ)ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రాయలసీమ వాసులు లేవనెత్తుతున్న ప్రధాన సమస్యలు, రాజధాని విషయంలో మోసం, కనీసం హైకోర్టునైనా ఏర్పాటు చేయకపోవడం, రాయలసీమ ప్రాజక్టులకు నిధులు కేటాయించకపోవడం, రాయలసీమకు వరదనీళ్లు కాదు నికరజలాలు కేటాయించడం గురించి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, ఇటు ప్రతిపక్ష నేత జగన్ గాని మాట్లాడటం లేదు. రాయలసీకు జరుగుతున్న బేసిక్ అన్యాయం గురించి మాట్లాడితే కోస్తా ఓట్లు పోతాయన్న భయం చంద్రబాబు జగన్ లలో ఉందనే విమర్శ ఒకటుంది. వారిద్దరికి రాయలసీమ బ్రాండ్ వేసుకోవడం ఇష్టం లేదని ఈ ప్రాంతంలోని ‘రాయలసీమ  వాద’ నేతలు అంటున్నారు. ఇలాంటపుడు మూడో శక్తిగా రాయలసీమకు వస్తున్న పవన్  ఏమ్మాట్లడతారనే దాని మీద చాల ఆసక్తి ఉంది అక్కడి  ప్రజల్లో. పవన్ కూడా కాస్మొటిక్ చర్యలతో ఉపన్యాసం దంచేసి వెళతారా? లేక రాయలసీమ అసలు సమస్యప్రస్తావించి మనసుదోచుకుంటారా చూడాలి. లేకపోతే, ప్రాంతీయ ముద్ర వేసుకుకోవడం ఎందుకని వెనకంజ వేస్తారా?

రాయలసీమ లో పర్యటించేటపుడు జగన్ విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ  టిడిపి, వైఎస్ ఆర్ సి రెండూ బలమయిన పార్టీలే. రెండు పార్టీల నేతలు బలమయిన కులాల వాళ్లే. ఇద్దరు రాయలసీమ వాళ్లే. పవన్ బయటి ప్రాంతం వ్యక్తి. అందువల్ల ఆయన వాళ్లకంటే భిన్నమయిన భాష వాడినపుడే అక్కడ ఆయన తనకంటూ కొంత స్పేస్ దక్కించుకోగలరు. లేక పోతే, సీమలో బలిజకులస్థులు ఎక్కువగానే ఉన్నా, ఆ కులపెద్దలంతా హాయిగా ఇతర పార్టీలలో ఒదిగిపోయారు. ఇలాంటి ప్రతికూలవాతావరణంలో పవన్ రాయలసీమ కు వస్తున్నారు. ఏ మ్మాట్లాడతారో చూడాలి.

వివరాలు :

కర్నూల్ జిల్లా లో 21, 22, 23వ తేదీల్లో పర్యటన…

కడప జిల్లా 25, 26, 27వ తేదీల్లో పర్యటిస్తారు. .

చిత్తూరు జిల్లాలో 28, మార్చి 1, 2వ తేదీల్లో పర్యటిస్తారు. 

త్వరలో పర్యటనకు మరిన్ని వివరాలను వెల్లడిస్తారు..

కడప జిల్లాలో ఆయన వివాదాస్పదమయిన యురేనియం ప్లాంట్ ను, స్టీల్ ప్లాంట్ స్థలాలను పరిశీలిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.  అదే విధంగా కడప కర్నూలు జిల్లాలలో కెసి కెనాల్ ను సందర్శించి ఆయుకట్టు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. రాయలసీమ ప్రధాన సమస్య సాగునీరు, తాగు నీరు. ఇది నికర జలాలకు సంబంధించిన సమస్య. ఇపుడు రాయలసీకు చూపిస్తున్నదంతా వరద నీరే. ఇది కాదు, మాకుకోటా కావాలనుకుంటున్నారు. ఈ సమస్య మీద ఆయన ఆ ప్రాంత  ముఖ్య నేతలతో చర్చిస్తారు.

 

సీమ జిల్లాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ సమస్యల ను అధ్యయనం చేశాక సీమ జిల్లాల ప్రధాన సమస్యలు ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంటుందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలుగు రాజ్యం కు చెప్పారు.