చంద్రబాబు, పవన్ ఇళ్లకూ వైసీపీ స్టిక్కర్లు!

ఏపీలో వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన… “జగనన్నే మా భవిష్యత్తు” అనే కార్యక్రమాన్ని వైసీపీ మొదలు పెట్టింది. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేతలు.. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లతో కలసి.. ఎమ్మెల్యేలు, మంత్రులంతా ఈరోజు ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అతికించారు. ఇదేక్రమంలో… మొబైల్ ఫోన్లకు కూడా స్టిక్కర్లు అతికించారు. ప్రభుత్వ పనితీరుకి సంబంధించి వారిని కొన్ని ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించారు. గడపగడపకూ కార్యక్రమల్లో ఏమైనా మిస్ అయినా.. అవి ఇక్కడ క్లియర్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో… చంద్రబాబు, పవన్ ఇంటికి కూడా స్టిక్కర్లు అతికిస్తామని అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు! ప్రస్తుతం ఈ డైలాగ్.. ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందభంగా మరింత మాట్లాడిన అంబటి… వైసీపీ ప్రభుత్వం చేపట్టిన “జగనన్నే మా భవిష్యత్తు” ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని, ప్రతి కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరాలు సేకరించి, బాధితులకు భరోసా ఇస్తూ.. ధైర్యం చెప్పే కార్యక్రమం ఇదని చెబుతున్నారు.

ఇక ప్రజల ఆశీస్సులు కోరుతూ… ఆయా కుటుంబాలకు లబ్ది జరిగితేనే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని చెబుతున్న అంబటి… కుల మతాలకు అతీతంగా పరిపాలన చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేననని చెప్పుకున్నారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని.. తాము చెబుతున్నవాటిలో ఏమాత్రం అసత్యం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు అంబటి. ఈ క్రమంలో… ఒప్పుకుంటే చంద్రబాబు, పవన్ ఇంటికి కూడా స్టిక్కర్లు వేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి.