ఏపీ సీఎం వైఎస్ జగన్ సవాల్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమంటారో?

ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు, పవన్ లకు భారీ షాకిచ్చేలా సవాల్ విసిరారు. దమ్ముంటే 175 స్థానాలలో పోటీ చేయాలంటూ జగన్ ఛాలెంజ్ చేయగా ఆ ఛాలెంజ్ హాట్ టాపిక్ అవుతోంది. పొత్తులు పెట్టుకుని వచ్చినా టీడీపీ జనసేన 175 స్థానాల్లో పోటీ చేయగలవా అనే అర్థం వచ్చేలా వైఎస్ జగన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ ఛాలెంజ్ గురించి చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

దుష్ట చతుష్టయానికి దత్త పుత్రుడు జత కలిశాడంటూ పవన్ పై జగన్ ఒకింత ఘాటు విమర్శలు చేశారు. కడుపు మంటకు, అసూయకు మందు లేదంటూ జగన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి టీడీపీకి కడుపుమంటగా ఉందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా జగన్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.

కరువుతో స్నేహం చేసిన చంద్రబాబుకు, మీ బిడ్డకు మధ్య యుద్ధం జరుగుతోందని ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పిన చంద్రబాబుకు, నాకు యుద్ధం జరుగుతోందని జగన్ చెప్పుకొచ్చారు. ఏపీలో గజదొంగల ముఠా ఉందని దోచుకో పంచుకో తినుకో అనేది ఆ ముఠా పని అని ఆ గజ దొంగల ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడని జగన్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు ఇన్ని పథకాలను ఎందుకు అమలు చేయలేదని ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయని జగన్ ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చంద్రబాబు వ్యతిరేకమని జగన్ పేర్కొన్నారు. మా దగ్గర పత్రికలు, న్యూస్ ఛానెళ్లు, దత్త పుత్రుడు లేకపోయినా మేము చేసిన మంచిని చెప్పుకొని అధికారంలోకి వస్తామని జగన్ అన్నారు.